Gadwal ZP Chairman : బీఆర్ఎస్ కు షాక్ సరిత రిజైన్
గద్వాల జిల్లా పరిష్ చైర్మన్ నిర్ణయం
Gadwal ZP Chairman : తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి పార్టీకి కోలుకోలేని షాక్ తగులుతోంది. ఇప్పటికే పలువురు నేతలు ఆ పార్టీని వీడారు. మరికొందరు గులాబీకి గుడ్ బై చెప్పే పనిలో పడ్డారు. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy), ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణా రావు ఆ పార్టీని వీడారు.
Gadwal ZP Chairman Announce
హైదరాబాద్ లో మంచి పట్టు కలిగి ఉన్న నాయకుడిగా గుర్తింపు పొందారు మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి. ఆయన కూడా జంప్ అయ్యే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇది ఇలా ఉండగానే మరో షాక్ తగిలింది. గద్వాల జిల్లా పరిషత్ కు చైర్మన్ గా ఉన్న సరిత తాను పార్టీకి గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించింది. ఆమె తీసుకున్న నిర్ణయం అందరినీ విస్తు పోయేలా చేసింది.
సరిత త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. మరో వైపు రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఎన్నికలు సమీపించే నాటికి బీఆర్ఎస్ , భారతీయ జనతా పార్టీ నుంచి పెద్ద ఎత్తున వలసలు ఉంటాయని ప్రకటించారు. ఆయన చెప్పినట్టుగానే ఒక్కో వికెట్ పడిపోతూనే ఉంది.
Also Read : V Muralidharan : మురళీధరన్ తో పవన్ ముచ్చట