Rahul Gandhi Yatra : ప్ర‌జా యాత్ర‌కు జ‌నం బ్ర‌హ్మ‌ర‌థం

కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయ‌కుడు, వాయ‌నాడు ఎంపీ రాహుల్ గాంధీ మ‌రోసారి హాట్ టాపిక్ గా మారారు. శ‌నివారం ఆయ‌న చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర దేశ రాజ‌ధాని ఢిల్లీకి చేరుకుంది. ఇప్ప‌టికే క‌రోనా ఎఫెక్ట్ ఎక్కువ‌గా ఉంద‌ని క‌రోనా రూల్స్ పాటించాల‌ని కోరుతూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మ‌న్సుఖ్ మాండ‌వీయ లేఖ రాయ‌డం క‌ల‌క‌లం రేపింది. భారీ ఎత్తున పార్టీకి చెందిన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లే కాదు స్వ‌చ్చందంగా వివిధ వ‌ర్గాల‌కు చెందిన వారు రాహుల్ గాంధీ యాత్ర‌లో పాలు పంచుకున్నారు.