Kamal Haasan Rahul Yatra : రాహుల్ యాత్ర‌లో లోక‌నాయ‌కుడు

ఈ దేశంలో త‌మిళులు ఎక్క‌డున్నా రాహుల్ గాంధీ యాత్ర‌లో పాల్గొనాల‌ని ఇప్ప‌టికే పిలుపునిచ్చిన లోక నాయ‌కుడు, ప్ర‌ముఖ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ ఉన్న‌ట్టుండి దేశ రాజ‌ధానిలో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు. దేశానికి ద్వేషం కాదు కావాల్సింది ప్రేమ కావాలనే నినాదంతో కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర‌లో లోక నాయ‌కుడు పాల్గొన్నారు.

హ‌స్తిన వేలాది మందితో నిండి పోయింది. ఎక్క‌డ చూసినా రాహుల్ గాంధీకి మ‌ద్ద‌తు ల‌భించింది. ఆయ‌న‌తో పాటు కాంగ్రెస్ నాయ‌కులు పాల్గొన్నారు. ఇదిలా ఉండ‌గా క‌మ‌ల్ హాస‌న్ రాహుల్ గాంధీతో పాటు ఢిల్లీలో అడుగులో అడుగులు వేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు తొమ్మిది రాష్ట్రాల‌లో పూర్త‌యింది రాహుల్ చేప‌ట్టిన యాత్ర‌.