Rahul Gandhi Ride Bike : బైక్ పై రాహుల్ గాంధీ హ‌ల్ చ‌ల్

మ‌ధ్య‌ప్ర‌దేశ్ పాద‌యాత్రలో నేత

Rahul Gandhi Ride Bike : రాహుల్ గాంధీ ఇప్పుడు ఎక్కువ‌గా దేశంలో వినిపిస్తున్న పేరు. ఎందుకంటే ఆయ‌న ప్ర‌స్తుతం జ‌నం మ‌ధ్యలో ఉన్నారు. దేశం ముక్క‌లు కానివ్వ‌నంటూ ప్ర‌క‌టించారు. ఈ దేశానికి ద్వేషం కాదు కావాల్సింది ప్రేమ అంటూ పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ఆయ‌న సోష‌ల్ మీడియాలో మోస్ట్ ట్రెండింగ్ పొలిటిక‌ల్ లీడ‌ర్ గా నిలిచారు.

రాహుల్ గాంధీ క‌న్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా పాద‌యాత్ర‌కు శ్రీ‌కారం చుట్టారు. ఇప్ప‌టి వ‌ర‌కు త‌మిళ‌నాడు, కేర‌ళ‌, క‌ర్ణాట‌క‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ‌, మహారాష్ట్ర‌ల‌లో భార‌త్ జోడో యాత్ర పూర్త‌యింది. ప్ర‌స్తుతం మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో కొన‌సాగుతోంది. ఇదిలా ఉండ‌గా వివిధ రంగాల‌కు చెందిన వారు రాహుల్ తో జ‌త క‌డుతున్నారు.

ఇప్ప‌టికే పూన‌మ్ కౌర్, పూజాభ‌ట్ తో పాటు మ‌హాత్మా గాంధీ మ‌నవ‌డు తుషార్ గాంధీ పాల్గొన్నారు. తాజాగా మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో కొన‌సాగుతున్న పాద‌యాత్ర‌లో ప్ర‌ముఖ బాక్స‌ర్, ఒలింపిక్స్ లో కాంస్య ప‌త‌క విజేత విజేంద‌ర్ సింగ్ రాహుల్ తో జ‌త క‌ట్టారు. ఆయ‌న 10 కిలోమీట‌ర్ల మేర పాద‌యాత్ర‌లో పాలు పంచుకున్నారు.

ఈ సంద‌ర్భంగా రాహుల్ గాంధీ, విజేంద‌ర్ క‌లిసి మీసాలు తిప్పారు. ఈ ఆస‌క్తిక‌ర స‌న్నివేశానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైర‌ల్ అయ్యాయి. తాజాగా రాహుల్ గాంధీ ఏకంగా బైక్ పై ఎక్కి(Rahul Gandhi Ride Bike) న‌డ‌ప‌డం విస్తు పోయేలా చేసింది. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైర‌ల్ గా మారాయి. మ‌రో వైపు రాహుల్ చేప‌ట్టిన పాద‌యాత్ర‌తో కాంగ్రెస్ పార్టీలో జోష్ పెరిగింది.

Also Read : కాషాయం రాజ్యాంగానికి వ్య‌తిరేకం – రాహుల్

Leave A Reply

Your Email Id will not be published!