RCB IPL 2023 Auction : ఆట‌గాళ్ల స‌మ‌తూకం ఆర్సీబీ అంద‌లం

రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు స‌మ‌తూకంపై ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టింది ఈసారి జ‌రిగిన వేలం పాట‌లో. ఇంగ్లండ్ బ్యాట‌ర్ విల్ జాక్స్ కు రూ. 3.2 కోట్లు పెట్టింది. రీస్ టోప్లీని రూ. 1.90 కోట్ల‌కు తీసుకుంది ఆర్సీబీ. త‌మ ప‌ర్స్ లో త‌క్కువ డ‌బ్బులు ఉండ‌డంతో ఎక్కువ‌గా ఆట‌గాళ్ల‌పై ఫోక‌స్ పెట్ట‌లేక పోయింది మేనేజ్ మెంట్. జాక్స్ కోసం ఎక్కువ ఖ‌ర్చు చేసింది.

ఇక సోనూ యాద‌వ్ , మ‌నోజ్ భాండాగే , హిమాన్షు శ‌ర్మ‌ల‌కు ఒక్క‌క్క‌రిని రూ. 20 ల‌క్ష‌ల‌కు తీసుకుంది ఆర్సీబీ. విరాట్ కోహ్లీ ఈసారి జ‌ట్టు కెప్టెన్సీ నుంచి త‌ప్పుకున్నాడు. అత‌డి స్థానంలో ఫాఫ్ డు ప్లెసిస్ కు అప్ప‌గించింది సార‌థ్య బాధ్య‌త‌ల‌ను. ఈసారి జ‌రిగిన ఐపీఎల్ లో క్వాలిఫైయ‌ర్ -2 కు చేరుకుంది ఆర్సీబీ. కానీ శాంస‌న్ సార‌థ్యంలోని రాజ‌స్థాన్ రాయ‌ల్స్ చేతిలో ఓట‌మి పాల‌య్యారు.