Minister Lokesh : ‘మోటా’ తో ఇపుడు వాట్సప్ ద్వారానే అన్ని సర్టిఫికెట్లు డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు

అధికారంలోకి రాగానే కూట‌మి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెర‌వేరుస్తోంది...

Nara Lokesh : క్యాస్ట్ స‌ర్టిఫికెట్ కావాలంటే మూడు గ‌వ‌ర్నమెంట్ ఆఫీసులు, న‌లుగురు వ‌ర‌కూ వివిధ హోదాల అధికారులు, సిబ్బంది చుట్టూ ఓ వారం రోజులు తిర‌గాల్సిందే. క‌రెంటు, న‌ల్లా, ఇంటి ప‌న్ను, ఇత‌ర‌త్రా బిల్లులు చెల్లించాలంటే సంబంధిత కార్యాల‌యాల్లో ఇప్పటికీ ఎడ‌తెగ‌ని క్యూల్లో నిరీక్షణ త‌ప్పదు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యద‌ర్శి నారా లోకేష్(Nara Lokesh) చేప‌ట్టిన యువ‌గ‌ళం పాద‌యాత్రలో ఈ స‌ర్టిఫికెట్ల క‌ష్టాల‌ను యువ‌త ఏక‌రువు పెట్టారు. వాట్సాప్‌లో ఒక టెక్ట్స్ మెసేజ్ చేస్తే ఇంటికి, మ‌నిషికి అవ‌స‌ర‌మైన స‌మ‌స్త వ‌స్తువులు వ‌స్తున్నప్పుడు, సేవ‌లు అందుతున్నప్పుడు.. ఒక స‌ర్టిఫికెట్ కోసం ఆఫీసులు చుట్టూ ప‌నులు మానుకుని మ‌రీ తిర‌గాల్సిన ప‌రిస్థితికి చెక్ పెడ‌తామ‌ని, ప్రభుత్వంలోకి రాగానే..వాట్సాప్ ద్వారా ప‌ర్మినెంట్ స‌ర్టిఫికెట్ పొందే అవ‌కాశం క‌ల్పిస్తామ‌ని లోకేష్ హామీ ఇచ్చారు.

Nara Lokesh Comment

అధికారంలోకి రాగానే కూట‌మి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెర‌వేరుస్తోంది. విద్య, ఐటీ, ఎల‌క్ట్రానిక్స్ శాఖ‌ల మంత్రిగా బాధ్యత‌లు నిర్వర్తిస్తున్న నారా లోకేష్(Nara Lokesh) యువ‌గ‌ళం పాద‌యాత్రలో ఇచ్చిన హామీల‌న్నీ ప్రాధాన్యతాక్రమంలో అమ‌లు చేస్తున్నారు. ప్రతి ఏడాది క్యాస్ట్ స‌ర్టిఫికెట్ల కోసం కార్యాల‌యాల చుట్టూ తిరిగే అవ‌స‌రం లేకుండా వాట్సాప్ ద్వారా పొందే ప‌ద్ధతి అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అలాగే వివిధ ర‌కాల బిల్లులు వాట్సాప్ ద్వారా చెల్లించవ‌చ్చు. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్ స్టా ఫ్లాట్‌ఫామ్స్ ద్వారా ప్రపంచ‌మంతా విస్తరించిన మెటాతో కీల‌క ఒప్పందం కుదుర్చుకోనుంది ఏపీ ప్రభుత్వం. ఐటీ, ఎల‌క్ట్రానిక్స్, ఆర్టీజీ, విద్య శాఖ‌ల మంత్రి నారా లోకేష్(Nara Lokesh) చొర‌వ‌తో మెటా ప్రజల‌కు ప్రభుత్వం నుంచి పౌర‌సేవ‌లు వాట్సాప్ బిజినెస్ ద్వారా అందించేందుకు అంగీక‌రించింది.

మెటా ఫ్లాట్ ఫాం వాట్సాప్ బిజినెస్ ద్వారా ఇక‌పై క్యాస్ట్, ఇత‌ర‌త్రా స‌ర్టిఫికెట్లు వేగంగా, సుల‌భంగా పొందేందుకు వీలవుతుంది. అలాగే న‌కిలీలు, ట్యాంప‌రింగ్ అవ‌కాశం లేకుండా పార‌ద‌ర్శకంగా ఆన్‌లైన్‌లోనే స‌ర్టిఫికెట్ల జారీ ఉంటుంది. మెటా నుంచి క‌న్సల్టేష‌న్ టెక్నిక‌ల్ స‌పోర్ట్, ఈ గ‌వ‌ర్నరెన్స్ అమ‌లు, ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్ ద్వారా మ‌రిన్ని సిటిజెన్ స‌ర్వీసెస్ ఏపీ ప్రభుత్వానికి అందించేలా మంత్రి నారా లోకేష్(Nara Lokesh) నేతృత్వంలో ఏపీ అధికారులు, మెటా ప్రతినిధులు ఢిల్లీ లోని 1 జన్‌పథ్‌లో జరిగిన కార్యక్రమంలో ఎంవోయూ చేసుకున్నారు. మెటాతో ఎంవోయూ ఒక చారిత్రాత్మక‌మైన మైలురాయి అని మంత్రి లోకేష్ అభివ‌ర్ణించారు. యువ‌గ‌ళం పాద‌యాత్రలో విద్యార్థులు, నిరుద్యోగులు వివిధ స‌ర్టిఫికెట్ల కోసం ప‌డుతున్న క‌ష్టాలు ప్రత్యక్షంగా చూసి.. మొబైల్‌లోనే ఆయా స‌ర్టిఫికెట్లు అందిస్తామని హామీ ఇచ్చానని చెప్పారు. తాను మాట ఇచ్చిన‌ట్టే ఈరోజు మెటాతో ఒప్పందం ద్వారా వాట్సాప్‌లోనే స‌ర్టిఫికెట్లు, పౌర‌సేవ‌లు పొందేలా మెటాతో ఒప్పందం చేసుకున్నామని… రానున్న రోజుల్లో మ‌రిన్ని సేవ‌లు ఆన్‌లైన్‌లో అతి సులువుగా, పార‌ద‌ర్శకంగా, త్వరగా పొందేలా ఏర్పాట్లు చేస్తామని ఐటీ మంత్రి లోకేష్ భ‌రోసా ఇచ్చారు.

మెటాలో ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్ సేవ‌లను వాడుకుని వాట్సాప్ ద్వారా ఏపీ ప్రజ‌ల‌కు పౌర సేవలను అందించేందుకు ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవ‌డం చాలా సంతోషంగా ఉంద‌ని సంధ్యా దేవనాథన్, వైస్ ప్రెసిడెంట్, మెటా ఇండియా ప్రక‌టించారు. అంద‌రూ త‌మ‌కు కావాల్సిన సేవ‌లు పొందేందుకు వీలుగా ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్‌, వాట్సాప్ అప్లికేష‌న్ ప్రోగ్రామింగ్ ఇంట‌ర్ ఫేస్ ఉంటుంద‌ని, తమ డిజిట‌ల్ టెక్నాల‌జీని వాడుకుని ఏపీ ప్రభుత్వం ద్వారా ప్రజ‌ల‌కు మ‌రిన్ని ఉత్తమసేవ‌లు అందించ‌గ‌ల‌మ‌ని ఆశాభావం వ్యక్తం చేశారు. హెచ్‌పీఎల్ విస్తర‌ణ‌, ఫాక్స్ కాన్, టీసీఎల్ వంటి గేమ్ ఛేంజ‌ర్ కంపెనీల‌ను ఏపీకి ర‌ప్పించిన లోకేష్‌, మెటాతో ఒప్పందంతో తానేంటో, త‌న ప‌నితీరు ఏ రేంజులో ఉంటుందో చెప్పక‌నే చెప్పారు. సీఎం చంద్రబాబు ఈ గ‌వ‌ర్నెన్స్ ఆలోచ‌న‌ల‌ను అమ‌లు చేయ‌డంలో లోకేష్ జెట్ స్పీడుతో ప‌నిచేస్తున్నారు. ఢిల్లీలోని 1 జన్‌పథ్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మెటా ఇండియా వైస్ ప్రెసిడెంట్ సంధ్యా దేవనాథన్, డైరెక్టర్ రవి గార్గ్, డైరెక్టర్ పబ్లిక్ పాలసీ నటాషా, ప్రభుత్వం తరపున ఐఏఎస్ అధికారులు యువరాజ్, ఆర్టీజిఎస్ సీఈఓ దినేష్ పాల్గొన్నారు.

Also Read : Minister Narayana : విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులపై కేంద్రంతో చర్చలు..

Leave A Reply

Your Email Id will not be published!