Anand Mahindra : రతన్ టాటా మృతి నమ్మలేకపోతున్నా అంటూ ట్వీట్ చేసిన మహీంద్రా అధినేత

రతన్ టాటా ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయారన్న వాస్తవాన్ని అంగీకరించలేకపోతున్నాను...

Anand Mahindra : భారతీయ వ్యాపార దిగ్గజం రతన్ టాటా ఇకలేరన్న వార్త యావత్ భారతాన్ని శోకసంద్రంలోకి నెట్టేసింది. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకూ అనేక మంది సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు. భారతీయ విలువలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్న రతన్‌టాటాకు నివాళులు అర్పిస్తున్నారు. రతన్ టాటా ఇక లేరన్న వాస్తవాన్ని తాను ఆమోదించలేకపోతున్నానని ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా(Anand Mahindra) విచారం వ్యక్తం చేశారు. ఆయన అడుగు జాడల్లో నడుస్తానని అన్నారు.

Anand Mahindra Tweet..

‘‘రతన్ టాటా ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయారన్న వాస్తవాన్ని అంగీకరించలేకపోతున్నాను. ప్రస్తుతం భారత ఆర్థిక రంగం ఈ స్థితిలో ఉండటంలో రతన్ టాటా పాత్ర గొప్పది. భారత ఆర్థిక రంగం కీలక దశకు చేరుకున్న ఈ తరుణంలో ఆయన మార్గదర్శకత్వం దేశానికి ఉపయోగపడి ఉండేది’’ అని ఎక్స్ వేదికగా ఆనంద్ మహీంద్రా వ్యాఖ్యానించారు. ఇక అందరూ ఆయన అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. సిరిసంపదలను ప్రజల మేలు కోసమే వెచ్చించాలని నమ్మిన వ్యక్తి టాటా అని ఆయన కొనియాడారు. భారత వ్యాపార, ఆర్థిక రంగాలకు ఆయన చేసిన సేవను దేశం ఎన్నడూ మర్చిపోదని అన్నారు. రతన్ టాటా ఎప్పటికీ ప్రజల మదిలోనే ఉంటారని వ్యాఖ్యానించారు. గొప్ప వ్యక్తులు ఎప్పటికీ ప్రజల మధ్యనే ఉంటారని అన్నారు.

Also Read : Ratan Tata : ప్రముఖ వ్యాపార దిగ్గజం టాటా గ్రూప్స్ అధినేత ‘రతన్ టాటా’ కన్నుమూత

Leave A Reply

Your Email Id will not be published!