MP DK Aruna : కాంగ్రెస్ సర్కార్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ

ఇప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా మహిళలు కాంగ్రెస్‏కు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు...

DK Aruna : తెలంగాణలో ఓ నియంత ప్రభుత్వం పోయి మరో నియంత ప్రభుత్వం రాజ్యమేలుతోందని మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ అన్నారు, చార్మినార్‌ వద్ద బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. హైకోర్టు అనుమతి తెచ్చుకొని బతుకమ్మ పండుగ నిర్వహించుకోవాల్సి రావడం బాధాకరమన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత మొదలైందని, మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలతో రాష్ట్రంలో మహిళలు ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు.

DK Aruna Comments

ఇప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా మహిళలు కాంగ్రెస్‏కు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో బీజేపీ జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్‌, తెలంగాణ మహిళ మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, బీజేపీ సీనియర్‌ నాయకుడు ఉమా మహేంద్ర, కునాల్‌రావు, భారీ సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

Also Read : PM Kisan : రైతన్నల ఖాతాల్లో నేడు 18వ విడత పీఎం కిసాన్ డబ్బులు

Leave A Reply

Your Email Id will not be published!