MP Eatala Rajender : వరదల్లో మరణించిన వారికి సర్కార్ 50 లక్షల పరిహారం అందించాలి

వరదల్లో మరణించిన వారికి సర్కార్ 50 లక్షల పరిహారం అందించాలి..

MP Eatala : ఏకదాటిగా కురుస్తున్న వర్షాలతో వరదల్లో మరణించిన ఒక్కొక్కరికి ప్రభుత్వం తక్షణమే రూ. 50లక్షల నష్టపరిహారం ప్రకటించాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. వరదల వల్ల కొట్టుకుపోయిన రోడ్లు, బ్రిడ్జీలను తక్షణమే ఉపయోగంలోకి తేవాలని కోరారు. నిర్వాసితులకు వరదసహాయక కేంద్రాల్లో అన్ని వసతులతో పాటు భోజన సదుపాయం ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

MP Eatala Rajender Comment

వరద తగ్గుముఖం పట్టిన అనంతరం ప్రభుత్వం నష్టపోయిన పంటపొలాలను పరిశీలించి రైతులను ఆదుకోవాలని సూచించారు. అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున వైద్యఆరోగ్య సిబ్బంది అవసరం మేరకు మందులను అందుబాటులో ఉంచాలని ఆయన పేర్కొన్నారు. బీజేపీ నాయకులు కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు సైతం వరద బాధితులకు సహాయ సహకారాలు అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Also Read : MP Mithunreddy: డైవర్షన్‌ రాజకీయాలు చేస్తున్నారు : ఎంపీ మిథున్‌రెడ్డి

Leave A Reply

Your Email Id will not be published!