Yanamala TDP : చెడు చేసిన వైసీపీకి ప్రజలు గుణపాఠం చెప్పారు

మంచి పనులు చేసే ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉంటారన్నారు...

Yanamala TDP : మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. కూటమి విజయం తర్వాత తొలిసారి మీడియాను ఉద్దేశించి యనమల మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజలే కీలకమన్నారు. నాయకులు దురుసుగా ప్రవర్తిస్తే ప్రజలు గుణపాఠం చెప్తారని నేర్చుకుంటారనడానికి ఎన్నికల ఫలితాలే ఉదాహరణ అన్నారు.

Yanamala TDP..

మంచి పనులు చేసే ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉంటారన్నారు. నీచమైన పని చేసిన వైసిపి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పామన్నారు. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజల సంపదను కొల్లగొట్టి సంపద సంపాదించారని యనమల అన్నారు. జగన్ దోపిడీ ప్రభుత్వాన్ని ప్రజాకూటమి గద్దె దించింది. జగన్ అక్రమాస్తులు, అవినీతి, దోపిడి వల్లే వైసీపీ ఓటమికి కారణమని ఆరోపించారు. జగన్ అనర్హుడని ప్రభుత్వం, ప్రతిపక్షాలు గుర్తించాయని యనమల అన్నారు.

Also Read : Narendra Modi : 3వ సారి మోదీ ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధం

Leave A Reply

Your Email Id will not be published!