Mithun Chakraborty : 21 మంది ఎమ్మెల్యేలు ట‌చ్ లో ఉన్నారు

మిథున్ చ‌క్ర‌వ‌ర్తి సంచ‌ల‌న కామెంట్స్

Mithun Chakraborty : ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు, భార‌తీయ జ‌న‌తా పార్టీ అగ్ర నాయకుడు మిథున్ చ‌క్ర‌వ‌ర్తి(Mithun Chakraborty) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. ప‌శ్చిమ బెంగాల్ లోని తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలు త‌మ‌తో ట‌చ్ లో ఉన్నార‌ని బాంబు పేల్చారు.

ఆదివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. టీఎంసీ నేత‌ల‌ను చేర్చుకోవ‌డంపై ప‌లు అభ్యంత‌రాలు ఉన్నాయ‌ని తెలిపారు. గ‌త ఏడాది అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు బీజేపీలో చేరిన స్టార్ హీరో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది.

గ‌త జూలైలో తాను చెప్పిన దానికి క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని చెప్పారు మిథున్ చ‌క్ర‌వ‌ర్తి. అధికార టీఎంసీకి చెందిన 38 మంది ఎమ్మెల్యేలు ప్ర‌తిప‌క్ష పార్టీతో ట‌చ్ లో ఉన్నారు.

వారిలో 21 మంది నేరుగా సంబంధం క‌లిగి ఉన్నార‌ని స్ప‌ష్టం చేశారు. ద‌య‌చేసి కొంత స‌మ‌యం ఇవ్వండి. సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి వ‌స్తాయ‌న్నారు మిథున్ చ‌క్ర‌వ‌ర్తి.

గ‌తంలో తాను ఏదైతే చెప్పానో అది క‌చ్చితంగా అమ‌లు కావ‌డం ఖాయ‌మ‌న్నారు. త్వ‌ర‌లోనే ఎవ‌రు త‌న‌తో ట‌చ్ లో ఉన్న వారెవ‌రో బ‌య‌ట పెడ‌తాన‌ని ప్ర‌క‌టించారు.

అయితే పార్టీలో అభ్యంత‌రాల గురించి తన‌కు బాగా తెలుస‌న్నారు. కానీ తాను మూర్ఖుడిని కాద‌ని, అవే త‌ప్పులు పున‌రావృతం కావ‌ని చెప్పాల‌ని అనుకుంటున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు మిథున్ చ‌క్ర‌వ‌ర్తి(Mithun Chakraborty).

ఇదిలా ఉండ‌గా ప‌శ్చిమ బెంగాల్ లోని టీఎంసీ స‌ర్కార్ ఐదేళ్ల ప‌ద‌వీ కాలాన్ని పూర్తి చేయ‌లేద‌ని , 2024 నాటికి ప‌వ‌ర్ కోల్పోవ‌డం ఖాయ‌మ‌న్నారు బీజేపీ ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు సువేందు అధికారి.

Also Read : చిరుత‌ల కోసం టాస్క్ ఫోర్స్ ఏర్పాటు – మోదీ

Leave A Reply

Your Email Id will not be published!