Chhotu Vasawa : టోపీ వాలాల‌తో పొత్తు ఉండ‌దు – ఛోటు వాస‌వా

భార‌తీయ గిరిజ‌న పార్టీ చీఫ్ ప్ర‌క‌ట‌న

Chhotu Vasawa : గుజ‌రాత్ కు చెందిన భార‌తీయ గిరిజ‌న పార్టీ (బీటీపీ) చీఫ్ ఛోటు వాస‌వా(Chhotu Vasawa) షాకింగ్ కామెంట్స్ చేశారు. తాము టోపీలు ధ‌రించిన వారితో పొత్తు పెట్టుకునే ప్ర‌స‌క్తి లేద‌న్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కు అర‌వింద్ కేజ్రీవాల్ చీఫ్ గా ఉన్న ఆప్ తో సంబంధం ఉండ‌ద‌ని స్ప‌ష్టం చేశారు. సోమ‌వారం కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. నాలుగు నెల‌ల భాగ‌స్వామ్యానికి ముగింపు ప‌లికింది.

ఆ పార్టీ త‌మ‌కు ఇష్టం లేద‌ని పేర్కొంది. కుంకుమ పువ్వు లేదా తెలుపు రంగు టోపీలు ధ‌రించే ఏ పార్టీతోనైనా జ‌ట్టు క‌ట్టండ‌ని పిలుపునిచ్చారు.

దేశంలో ప‌రిస్థితి భ‌యంక‌రంగా ఉంద‌ని, కుంకుమ పువ్వు టోపీలు ధ‌రించిన వారితో లేదా చీపురు గుర్తు ఉన్న తెల్ల‌టి టోపీలు ధ‌రించే ఏ టోపీ వాలాతోనూ మేము సంబంధం క‌లిగి ఉండ కూడ‌ద‌ని నిర్ణ‌యించామ‌న్నారు ఛోటు వాస‌వా(Chhotu Vasawa).

అవ‌న్నీ ఒక‌టే . ఈ దేశం ప‌గ‌డీలు ధ‌రించిన ప్ర‌జ‌ల‌ది. అన్ని పార్టీలు గిరిజ‌నుల స‌మ‌స్య‌ల‌ను విస్మ‌రించాయ‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు బీటీపీ చీఫ్‌.

ఇదిలా ఉండ‌గా మే1న భరూచ్ లోని చందేరియా గ్రామంలో సంయుక్తంగా ప్ర‌సంగిచ‌న ఆదివాసీ సంక‌ల్ప్ మ‌హా స‌మ్మేళ‌న్ లో కేజ్రీవాల్, ఛోటు వాస‌వ‌, ఆయ‌న కుమారుడు మ‌హేష్ వాస‌వ కూట‌మిని ప్ర‌కటించారు. ఆ త‌ర్వాత రెండు పార్టీల కూట‌మి భాగ‌స్వాముల మ‌ధ్య సంబంధాలు దెబ్బ తిన్నాయి.

గుజ‌రాత్ రాష్ట్రంలో ఈ ఏడాది డిసెంబ‌ర్ లో జ‌ర‌గ‌నున్న రాష్ట్ర ఎన్నిక‌ల్లో 182 స్థానాల్లో పోటీ చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు ఛోటు వాస‌వా.

Also Read : అసంతృప్తి అబ‌ద్దం ప్ర‌చారం అవాస్త‌వం

Leave A Reply

Your Email Id will not be published!