RS Praveen Kumar : కేటీఆర్ కామెంట్స్ ఆర్ఎస్పీ సీరియ‌స్

ఇక‌నైనా మీ భాష‌ను..భావ జాలాన్ని మార్చుకోండి

RS Praveen Kumar KTR : మంత్రి కేటీఆర్ డాక్ట‌ర్ ప్రీతి ప‌ట్ల చేసిన కామెంట్స్ పై సీరియ‌స్ గా స్పందించారు(RS Praveen Kumar KTR) బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్. ఎంతో క‌ష్ట‌ప‌డి ఉన్న‌త చ‌దువులు చ‌దువు కోవ‌డం చాలా ఇబ్బంది. ఇప్ప‌టి ప‌రిస్థితుల్లో చ‌దువు కోవ‌డం కంటే కొన‌డ‌మే ఇబ్బందిగా మారింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

డాక్ట‌ర్ బాబా సాహెబ్ అంబేద్క‌ర్ పుణ్య‌మా అని ద‌ళితులు, మైనార్టీలు, బ‌హుజ‌నులకు చెందిన పిల్ల‌లు ఇవాళ కాస్తో కూస్తో చ‌దువుకునే ప‌రిస్థితి నెల‌కొంద‌న్నారు. కానీ దానిని కూడా రాజ‌కీయం చేయ‌డం భావ్యం కాద‌న్నారు.

స‌భ‌లో మాట్లాడిన మంత్రి ప్రీతి కుటుంబాన్ని సంద‌ర్శించారా అని ప్ర‌శ్నించారు. ఆమె మ‌ర‌ణం ప‌ట్ల రాజ‌కీయం చేయాల‌ని ఎవ‌రూ అనుకోర‌ని పేర్కొన్నారు. ఎవ‌రిదైనా ప్రాణమేన‌ని పేర్కొన్నారు. అస‌లు దోషులు ఎవ‌రో , దానికి గ‌ల కార‌ణాలు ఏమిటో తెలియాల‌ని అన్నారు. ముందుగా సిట్టింగ్ జ‌డ్జితో విచార‌ణ చేప‌ట్టాల‌ని ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ డిమాండ్ చేశారు. బీఎస్పీ త‌ర‌పున ఆ కుటుంబాన్ని ఆదుకుంటామ‌ని , అన్ని రకాలుగా అండ‌గా ఉంటామ‌ని స్ప‌ష్టం చేశారు.

విద్యార్థులు కూడా వివ‌క్ష‌ను ఎదుర్కొనే స్థైర్యాన్ని పెంపొందించు కోవాల‌ని సూచించారు. లేక‌పోతే ఎక్క‌డా పోరాడ‌లేమ‌ని హెచ్చ‌రించారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా చ‌దువు కోవ‌డం మానుకోవ‌ద్ద‌ని పేర్కొన్నారు . ఎందుకంటే చ‌దువే మ‌న‌ల్ని ఉన్న‌త స్థాయికి తీసుకు వెళుతుంద‌ని అదే మ‌న‌కు గుర్తింపు తెస్తుంద‌ని అన్నారు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్(RS Praveen Kumar). మంగ‌ళ‌వారం ట్విట్ట‌ర్ వేదిక‌గా తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు బీఎస్పీ స్టేట్ చీఫ్‌.

Also Read : క‌డుపు శోకం వెల క‌ట్ట‌లేం

Leave A Reply

Your Email Id will not be published!