FIR BJP Leaders : మాజీ మంత్రి, ఎమ్మెల్యేపై కేసు న‌మోదు

సీఎం సిద్ద‌రామ‌య్య‌పై అనుచిత కామెంట్స్

FIR BJP Leaders : క‌ర్ణాట‌క సీఎం సిద్ద‌రామ‌య్య‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన భార‌తీయ జ‌న‌తా పార్టీకి(BJP) చెందిన నేత‌ల‌పై పోలీసులు కేసు న‌మోదు చేశారు. బీజేపీకి చెందిన మాజీ మంత్రి ,మ‌ల్లేశ్వ‌రం ఎమ్మెల్యే అశ్వ‌త్ నారాయ‌ణ్ పై సెక్ష‌న్ 506, 153 కింద కేసు న‌మోదైంది. సిద్ద‌రామ‌య్య 24 మంది హిందువుల‌ను హ‌త్య చేశారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన బెల్తంగ‌డి ఎమ్మెల్యే హ‌రీష్ పూంజాపై సెక్ష‌న్ 153, 153ఏ, 505 కింద కేసు న‌మోదు చేశారు.

ఈ ఇద్ద‌రూ ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌చార స‌మ‌యంలో ఈ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇద్ద‌రు చేసిన కామెంట్స్ క‌ల‌కలం రేపాయి. ఇక ఊహించ‌ని రీతిలో క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వంలోకి వ‌చ్చింది. 224 సీట్ల‌కు గాను 135 సీట్లు కైవ‌సం చేసుకుని అతి పెద్ద పార్టీగా అవ‌త‌రించింది. ఇక అధికారంలో ఉన్న బీజేపీ ప్ర‌భుత్వం కేవ‌లం 65 సీట్ల‌కే ప‌రిమిత‌మైంది. ఇక చ‌క్రం తిప్పుతానంటూ బీరాలు ప‌లికిన జేడీఎస్ చీఫ్ ,మాజీ సీఎం కుమార స్వామి 19 సీట్ల‌కే ప‌రిమితం అయ్యారు.

ఇక వీరితో పాటు న‌లుగురు స్వతంత్ర అభ్య‌ర్థులు గెలుపొందారు. ఆ న‌లుగురు సైతం కాంగ్రెస్ పార్టీకి బేష‌ర‌తుగా మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. తాజాగా బీజేపీకి చెందిన మాజీ మంత్రి, ఎమ్మెల్యేపై కేసులు న‌మోదు చేయ‌డంతో బీజేపీ ఒక్క‌సారిగా ఉలికి పాటుకు గురైంది.

Also Read : Modi Govt Failure

 

Leave A Reply

Your Email Id will not be published!