Congress MP Vasant Chavan: మహారాష్ట్రలో కాంగ్రెస్ ఎంపీ వసంత్ చవాన్ కన్నుమూత !
మహారాష్ట్రలో కాంగ్రెస్ ఎంపీ వసంత్ చవాన్ కన్నుమూత !
Congress MP: మహారాష్ట్ర రాజకీయాల్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కాంగ్రెస్ సీనియర్ నేత, నాందేడ్ ఎంపీ వసంత్ చవాన్(69) తుది శ్వాస విడిచారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చవాన్ చికిత్స పొందుతూ హైదరాబాద్ లో మృతిచెందారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…
మహారాష్ట్రలోని నాందేడ్ లోక్సభ కాంగ్రెస్ ఎంపీ(Congress MP) వసంతరావు చవాన్ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న చవాన్ హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆరోగ్య పరిస్థితి విషమించి ఆదివారం అర్ధరాత్రి మృతిచెందినట్టు తెలుస్తోంది. చవాన్ శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్టు సమాచారం.
Congress MP – వసంత్ చవాన్ రాజకీయ చరిత్ర !
వసంతరావ్ చవాన్ మహారాష్ట్రకు చెందిన సీనియర్ నాయకుడు. 2009లో నైగావ్ అసెంబ్లీ స్థానం నుంచి గెలిచి తొలిసారి మహారాష్ట్ర అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన సెప్టెంబర్ 2014లో కాంగ్రెస్ లో చేరాడు. పార్టీలో చేరడానికి ముందు మేలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి నియమించబడ్డాడు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో నైగావ్ స్థానం నుంచి మరోసారి విజయం సాధించారు. 2024లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో వసంతరావు నాందేడ్ లోక్సభ స్థానం నుంచి 59,442 ఓట్లతో గెలుపొందారు. బీజేపీకి చెందిన చిఖ్లికర్ ప్రతాపరావు గోవిందరావుపై ఆయన విజయం సాధించారు. వసంత్ చవాన్ మరణం మహారాష్ట్ర కాంగ్రెస్కు తీరని లోటు అంటూ పార్టీ నేతలు చెబుతున్నారు. చవాన్ మరణంపై కాంగ్రెస్ అగ్రనాయకులతో పాటు మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలు సంతాపం ప్రకటించారు.
Also Read : Sanjay Roy: కోల్కతా డాక్టర్ హత్యాచారం కేసు నిందితునికి ముగిసిన లై డిటెక్టర్ పరీక్ష !