న్యూఢిల్లీ : ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా ప్రస్తుతం సంచలనంగా మారాడు దేశ వ్యాప్తంగా. తను కీలకమైన అంశాల గురించి ఏకి పారేశాడు పార్లమెంట్ సాక్షిగా. ఆయన సంధించిన ప్రశ్నలు ఇప్పుడు కోట్లాది మందిని ప్రభావితం చేస్తున్నాయి. తను వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మౌనంగా ఉండి పోయారు ప్రధాని మోదీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. ప్రధానంగా మహిళలు, బాలికలు, విద్యార్థినుల గురించి ప్రస్తావించాడు. ప్యాడ్లు, నీరు, ప్రైవసీ లేక అమ్మాయి స్కూల్ మిస్ అయితే అది ఆమె సమస్య కాదన్నారు. ఇది పూర్తిగా నేటి సమాజం వైఫల్యంగా చూడాలన్నాడు ఎంపీ రాఘవ్ చద్దా. మద్యం, సిగరెట్లు బహిరంగంగా అమ్ముతున్న దేశంలో సానిటరీ ప్యాడ్లను మాత్రం దాచాల్సిన పరిస్థితి ఇంకా ఎందుకు ఉందో చెప్పాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నాడు.
రాజ్యసభలో రాఘవ్ చద్దా రుతుక్రమ కళంకాన్ని విమర్శించారు. శానిటరీ ప్యాడ్లు, నీరు, గోప్యత లేక పోవడం వల్ల ఒక అమ్మాయి పాఠశాలకు వెళ్లకపోతే, అది ఆమె వ్యక్తిగత సమస్య కాదదన్నారు. పూర్తిగా ఆయా ప్రభుత్వాల వైఫలంగా భావించాల్సి ఉంటుందన్నాడు. పీరియడ్స్ను కళంకం చేయడంపై బలమైన వాదనలు వినిపించారు. 35 కోట్ల మంది మహిళలు , బాలికలు సిగ్గు లేకుండా ఋతు పరిశుభ్రత గురించి మాట్లాడ లేకపోతే దేశం తనను తాను నిజంగా ప్రగతిశీలమని చెప్పుకోలేమని అన్నారు. రుతు పరిశుభ్రత దాతృత్వం కాదు. ఇది ఒక ఉపకారం కాదు. ఇది ఒక ఉపాయం కాదు. ఇది ఆరోగ్యం, విద్య సమానత్వానికి సంబంధించిన విషయమని పేర్కొన్నారు ఎంపీ. అన్నింటికంటే ముఖ్యంగా, ఇది గౌరవానికి సంబంధించినదని స్పష్టం చేశాడు.
