ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈద్-ఉల్-ఫితర్ సెలవు కారణంగా పదవ తరగతికి సంబంధించి జరగాల్సిన ఆంగ్ల పరీక్షను వాయిదా వేసినట్లు తెలిపింది. ఇదిలా ఉండగా ఈ పరీక్ష వాస్తవానికి మార్చి 21న జరగాల్సి ఉంది. ఆంగ్ల పేపర్ (పేపర్ కోడ్లు 13E , 14E) ను తిరిగి ఇప్పుడు 2 న నిర్వహించనున్నట్లు తెలిపింది. ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయం నుండి వెలువడిన అధికారిక ప్రకటన ప్రకారం 21న కాకుండా గురువారం నాడు నిర్వహించ బడుతుంది. ఈ పరీక్ష ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 గంటల వరకు జరుగుతుంది .
సవరించిన ఈ పరీక్షల షెడ్యూల్ గురించి తమతమ జిల్లాల్లో విస్తృతంగా ప్రచారం కల్పించాలని జిల్లా విద్యాధికారులను ఆదేశించారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి . ఈ మార్పు గురించి ఉప విద్యాధికారులు, మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు, ముఖ్య పర్యవేక్షకులు , శాఖాపరమైన అధికారులు, ఇన్విజిలేటర్లు , పరీక్షకు హాజరయ్యే విద్యార్థులందరికీ తెలియజే యాలని సూచనలు జారీ చేశారు. వాయిదా పడిన ఈ పరీక్ష సజావుగా జరిగేలా చూసేందుకు సమగ్ర ఏర్పాట్లు చేయాలని కూడా అధికారులను కోరారు.
పరీక్షా కేంద్రాల సంసిద్ధత, సిబ్బందిని నియమించడం , అవసరమైన అన్ని లాజిస్టికల్ ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయడం వంటి అంశాలు ఈ ఏర్పాట్లలో భాగంగా ఉంటాయి. మార్చి 21న విధులు నిర్వర్తించడానికి నియమితులైన ఇన్విజిలేటర్లు, వాయిదా పడిన తేదీ అయిన ఏప్రిల్ 2న కూడా తమ బాధ్యతలను యథావిధిగా కొనసాగిస్తారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. దీనికి సంబంధించి శాఖాపరంగా ప్రత్యేక సవరణ ఉత్తర్వులు జారీ చేయబడతాయి.
