Aadavallu Meeku Johaarlu : 19న ఆడ‌వాళ్లు మీకు జోహార్లు టీజ‌ర్

25న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల‌

Aadavallu Meeku Johaarlu  : నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా, శ‌ర్వానంద్ క‌లిసి న‌టించిన ఆడ‌వాళ్లు మీకు జోహార్లు(Aadavallu Meeku Johaarlu )మూవీకి సంబంధించిన ట్రైల‌ర్ ఈనెల 19న విడుద‌ల కానుంది. ఈ విష‌యాన్ని మూవీ మేక‌ర్స్ వెల్ల‌డించారు.

కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో కుటంబ క‌థా ప‌రంగా తెర‌కెక్కింది ఈ చిత్రం. ప్రస్తుతం సినిమాకు సంబంధించి పోస్ట‌ర్ ను రిలీజ్ చేశారు. శ్రీ ల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్ బ్యాన‌ర్ పై సుధ‌క‌ర్ చెరుకూరి దీనిని నిర్మిస్తున్నారు.

సీనియ‌ర్ న‌టీమ‌ణులు కుష్భూ, రాధిక శ‌ర‌తా కుమార్ , ఊర్వ‌శి కూడా ఇందులో న‌టించ‌డం విశేషం. ఈనెల 25న ప్రపంచ వ్యాప్తంగా ఆడ‌వాళ్లు మీకు జోహార్లు మూవీని రిలీజ్ చేయ‌నున్నారు.

చిత్రానికి సంబంధించి క‌థ ద‌ర్శ‌కుడే రాసుకున్నాడు. ఆయ‌న గ‌తంలో మాట‌ల ర‌చ‌యిత‌గా కూడా ప‌ని చేశారు. మొద‌టి నుంచీ ద‌ర్శ‌కుడికి భ‌క్తి ఎక్కువ‌. ఛాయా గ్ర‌హ‌ణం సుజిత్ సారంగ్ , సంగీతం రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ అందించారు.

రొమాంటిక్ తో పాటు కాస్తంత కామెడీ కూడా ఉండ‌డంతో ఈ మూవీపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ర‌ష్మిక మంద‌న్నా ఇప్పుడు నేష‌న‌ల్ వైడ్ గా పేరు తెచ్చుకుంది. ఇటీవ‌ల రిలీజ్ అయిన పుష్ప మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది.

వెన్నెల కిషోర్ , ర‌విశంక‌ర్ , ప్ర‌దీప్ రావ‌త్ , స‌త్య‌, గోప‌రాజు ర‌మ‌ణ‌, బెన‌ర్జీ, క‌ళ్యాణి న‌ట‌రాజ‌న్ , రాజ‌శ్రీ నాయ‌ర్, ఝాన్సీ, ర‌జిత‌, స‌త్య కృష్ణ‌న్ కూడా న‌టించారు.

ఇదిలా ఉండ‌గా ఆడ‌వాళ్లు మీకు జోహార్లు మూవీకి (Aadavallu Meeku Johaarlu చెందిన టీజ‌ర్ , పోస్ట‌ర్, సాంగ్స్ కు మంచి ఆద‌ర‌ణ ల‌భించింది.

Also Read : ‘జీ స‌రిగ‌మ‌ప’ కోసం పూజా హెగ్డే

Leave A Reply

Your Email Id will not be published!