Aadavallu Meeku Joharlu : ఆడవాళ్లు మీకు జోహార్లు డేట్ ఫిక్స్
ఫిబ్రవరి 25న రిలీజ్ చేస్తామని వెల్లడి
Aadavallu Meeku Joharlu : శర్వానంద్, లవ్లీ గర్ల్ రష్మిక మందన్నా కలిసి నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు (Aadavallu Meeku Joharlu)మూవీ డేట్ ఫిక్స్ అయ్యింది. మూవీ మేకర్స్ ఇవాళ ట్విట్టర్ వేదికగా అధికారికంగా ప్రకటించారు. వచ్చే నెల ఫ్రిబవరి 25న థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.
దీంతో ఓటీటీ ద్వారా వస్తుందన్న ప్రచారానికి తెర దించారు. ఇప్పటికే రష్మిక మందన్నా ఏ సినిమా నటించినా అది బ్లాక్ బస్టర్ అవుతోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో కలిసి నటించిన పుష్ప దుమ్ము రేపింది.
దేశ వ్యాప్తంగా క్రష్మిక మందన్నాగా మారి పోయింది. ఇక శర్వానంద్ కు ఎలాంటి హిట్ లేకుండా పోయింది. ఈ తరుణంలో వస్తున్న మూవీ కావడం విశేషం. ఈ చిత్రంపై గంపెడు ఆశలు పెట్టుకున్నాడు శర్వానంద్(Aadavallu Meeku Joharlu).
పూర్తిగా రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కించాడు దర్శకుడు కిషోర్ తిరుమల. 2020లో స్టార్ట్ అయింది. కరోనా మహమ్మారి కారణంగా సినిమా షూటింగ్ కు అంతరాయం కలిగింది.
ఈ ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తారని అంతా అనుకున్నారు. కానీ పరిస్థితుల కారణంగా రిలీజ్ డేట్ ను ఫిబ్రవరికి ఛేంజ్ చేశారు. సినిమా పరంగా చూస్తే కథ ఓ ఫ్యామిలీ చుట్టూ తిరుగుతుంది.
ఒక కుటుంబంలో పురుషాధిపత్యాన్ని వర్ణించే సందేశాత్మక చిత్రంగా ఉండబోతోంది. ఇంట్లో లేదా సమాజంలో మహిళల పాత్ర , ప్రాముఖ్యత ఏమిటి అన్నదే దీని ముఖ్య ఉద్దేశంగా ఉండనుంది ఈ మూవీ.
ఖుష్బు సుందర్, రాధిక శరత్ కుమార్ , ఊర్వశి ఇందులో నటిస్తున్నారు.
Also Read : తాల్ సే తాల్ మిలా