Ajmer Shrine Chief : ఏ మ‌తం హింస‌ను ప్రోత్స‌హించ‌దు

అజ్మీర్ ద‌ర్గా చీఫ్ అబెదిన్ అలీ ఖాన్

Ajmer Shrine Chief : దేశంలోని ప్ర‌ముఖ ద‌ర్గా అయిన అజ్మ‌ర్ ద‌ర్గా దీవాన్ (చీఫ్‌) జైనుల్ అబెదిన్ అలీ ఖాన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. రాజ‌స్థాన్ లోని ఉద‌య్ పూర్ లో చోటు చేసుకున్న ఘ‌ట‌న‌పై స్పందించారు.

భార‌త దేశంలో తాలిబ‌నైజేష‌న్ మైండ్ సెట్ ను ఎట్టి ప‌రిస్థితుల్లో అనుమ‌తించ బోమ‌న్నారు. హింసాత్మ‌క మార్గం వ‌ల్ల ఏమీ సాధించ లేమ‌ని పేర్కొన్నారు. రాడిక‌ల్ గ్రూపుల్లో నిందితులు భాగ‌మేన‌ని ఆరోపించారు దీవాన్.

హంతకుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అజ్మీర్ ద‌ర్గా చీఫ్(Ajmer Shrine Chief)  ప్ర‌భుత్వాన్ని కోరారు. ఉద‌య్ పూర్ లో టైల‌ర్ ను దారుణంగా హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. ఈ హ‌త్య‌ను తీవ్రంగా ఖండించారు.

అజ్మీర్ ద‌ర్గా దీవాన్ జైనుల్ అబెదిన్ అలీ ఖాన్ మీడియాతో మాట్లాడారు. భార‌త దేశంలోని ముస్లింలు తాలిబ‌నీక‌ర‌ణ ఆలోచ‌న‌ను ఎప్ప‌టికీ అనుమ‌తించ‌ర‌ని చెప్పారు.

ఇస్లాం మ‌తాన్ని అవ‌మానించినందుకు ప్ర‌తీకారం తీర్చుకుంటున్న‌ట్లు వీడియోల‌ను ఆన్ లైన్ లో పోస్ట్ చేశారు. ఇది క‌ల‌క‌లం రేపింది. సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

ఈ సంద‌ర్భంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఏ మ‌తం మాన‌వాళికి వ్య‌తిరేకంగా హింస‌ను ప్రోత్స‌హించ‌ద‌ని స్ప‌ష్టం చేశారు. ఇస్లాం మ‌తంలో అన్ని బోధ‌న‌లు శాంతికి మూలాలుగా ప‌ని చేస్తాయ‌ని చెప్పారు.

కొంత మంది నైతిక‌త లేని వ్య‌క్తులు ఒక పేద‌వాడిపై క్రూర‌మైన దాడికి పాల్ప‌డ‌డం దారుణ‌మ‌న్నారు. ఇది ఇస్లామిక్ ప్ర‌పంచంలో శిక్షార్హ‌మైన పాపంగా ప‌రిగ‌ణించ బ‌డుతుంద‌న్నారు.

ఇదిలా ఉండ‌గా జ‌మియ‌త్ ఉలేమా ఏ హింద్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి మౌలానా హ‌కి ముద్దీన్ ఖాష్మీ కూడా ఈ హ‌త్య‌ను ఖండించారు. ఈ ఘ‌ట‌న‌ను ఎవ‌రు చేసినా ఏ విధంగానూ స‌మ‌ర్తించ లేమ‌ని పేర్కొన్నారు.

Also Read : శాంతితోనే స‌మాజం మ‌నుగ‌డ – రాహుల్

Leave A Reply

Your Email Id will not be published!