Bandi Sanjay : అంతా నాట‌కం అరెస్ట్ ఖాయం – బండి

క‌ల్వ‌కుంట్ల కుటుంబం అవినీతిమ‌యం

Bandi Sanjay : కోరి తెచ్చుకున్న తెలంగాణ‌ను అప్పులపాలు చేసిన ఘ‌న‌త కేసీఆర్ కే ద‌క్కుతుంద‌న్నారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజ‌య్. క‌ల్వ‌కుంట్ల క‌విత‌ తండ్రికి త‌గ్గ త‌న‌యురాలు అనిపించుకుంద‌ని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఇంత మంది ప్ర‌జాప్ర‌తినిధులు ఉన్నా ఎందుక‌ని ఒక్క క‌విత‌కే నోటీసులు ఇచ్చిందో అర్థం చేసుకోవాల‌న్నారు. తాను చిలుక ప‌లుకులు ప‌లికితే వినే ప‌రిస్థితిలో జ‌నం లేర‌న్నారు బండి సంజ‌య్. ఆయ‌న చేప‌ట్టిన పాద‌యాత్ర నిర్మ‌ల్ జిల్లాలో కొన‌సాగుతోంది.

ఎమ్మెల్సీ క‌విత‌కు అరెస్ట్ చేస్తార‌నే భ‌యం ప‌ట్టుకుంద‌న్నారు బండి సంజ‌య్(Bandi Sanjay). అందుకే విచార‌ణ‌కు హాజ‌రు కాకుండా దొంగ సాకులు వెతుకుతోంద‌న్నారు. ల‌క్ష కోట్ల‌తో లిక్క‌ర్ దందా చేసింద‌ని ఆరోపించారు . అరెస్ట్ నుంచి త‌ప్పించుకునేందుకు కొత్త డ్రామాలు మొద‌లు పెట్టింద‌ని ఎద్దేవా చేశారు. సినిమాల్లో న‌టులు పాత్ర‌ల మేర‌కే న‌టిస్తార‌ని కానీ క‌విత వాళ్ల‌ను మించి పోయింద‌న్నారు. మ‌రోసారి తెలంగాణ సెంటిమెంట్ ను ర‌గిల్చేందుకు కుట్ర చేస్తున్నారంటూ ధ్వ‌జ‌మెత్తారు.

బ‌తుక‌మ్మ పేరుతో కోట్లు దండుకున్న‌ది కాక ఏకంగా ఢిల్లీకి పోయి లిక్క‌ర్ దందా చేసే అవ‌స‌రం ఏమొచ్చింద‌ని ప్ర‌శ్నించారు బండి సంజ‌య్. తాను త‌ప్పు చేయ‌క‌పోతే 10 ఫోన్ల‌ను ఎందుకు ధ్వంసం చేసిందో చెప్పాల‌న్నారు.

ఈడీ, సీబీఐ, ఐటీ దాడులు జ‌రిపినా, సోదాలు చేసినా ఈ క‌విత‌క్క పేరే ఎందుకు ప్ర‌ధానంగా బ‌య‌ట‌కు వ‌స్తోంద‌ని ప్ర‌శ్నించారు. ఒక్క లింక‌ర్ దందానే కాదు ల్యాండ్, శాండ్ , డ్ర‌గ్స్ ల‌లో కూడా వీరి ఫ్యామిలీకి లింకు ఉంద‌ని ఆరోపించారు బండి సంజ‌య్ కుమార్ ప‌టేల్.

Also Read : ఎగ్జిట్ పోల్స్ లో క‌మల వికాసం

Leave A Reply

Your Email Id will not be published!