Amit Shah : త్రిపుర‌ ఎన్నిక‌లపై టార్చ్ బేర‌ర్ ఫోక‌స్

ర‌థ జాతాల‌కు అమిత్ చంద్ర షా శ్రీ‌కారం

Amit Shah : దేశంలో ఎన్నిక‌ల వేడి మెల మెల్ల‌గా కొన‌సాగుతోంది. ఓ వైపు కాంగ్రెస్ పార్టీ పాద‌యాత్ర‌ల‌ను న‌మ్ముకుంది. మ‌రో వైపు బీజేపీ ఎన్నిక‌ల స‌మ‌రానికి సిద్ద‌మ‌వుతోంది. ఇప్ప‌టికే క‌ర్ణాట‌క‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని ప్రారంభించారు ట్ర‌బుల్ షూట‌ర్ గా పేరొందిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా(Amit Shah). తాజాగా త్రిపుర‌లో భార‌తీయ జ‌న‌తా పార్టీ జెండాను మ‌రోసారి ఎగుర‌వేసేందుకు ప్లాన్ చేస్తున్నారు టార్చ్ బేర‌ర్.

ఒక రోజు రాష్ట్రంలో ప‌ర్య‌టించ‌నున్నారు. బుధ‌వారం జెండా ఊపి ర‌థ జాతాల‌ను ప్రారంభించ‌నున్నారు. ఇప్ప‌టికే రాష్ట్ర వ్యాప్తంగా భార‌తీయ జ‌న‌తా పార్టీ ఆధ్వ‌ర్యంలో బ‌హిరంగ స‌భ‌లు, ర్యాలీలు నిర్వ‌హించేందుకు రాష్ట్ర బీజేపీ ఏర్పాట్లు చేసింది.

ఇవాళ రాత్రి 10 గంట‌ల‌కు రాష్ట్రానికి చేరుకుంటారు అమిత్ చంద్ర షా. ముంద‌స్తు షెడ్యూల్ ప్ర‌కారం గురువారం త్రిపుర‌కు వెళ్లాల‌ని నిర్ణ‌యించారు. కానీ ఒక రోజు కంటే ముందే రాష్ట్రానికి చేరుకుంటున్న‌ట్లు పార్టీ రాష్ట్ర చీఫ్ వెల్ల‌డించారు. 

ఎయిర్ ఫోర్స్ కు చెందిన విమానంలో ఇక్క‌డికి చేరుకుంటారు. అత్యంత క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త భ‌ద్య అమిత్ షా(Amit Shah) రాష్ట్ర గెస్ట్ హౌల్ లో బ‌స చేస్తార‌ని వెల్ల‌డొంచారు బీజేపీ చీఫ్‌.

ఒక రోజు మాత్ర‌మే ఉంటారు. బీజేపీ చేప‌ట్టిన రెండు ర‌థ జాత‌ర‌ల‌ను జెండా ఊపి ప్రారంభించ‌నున్నారు. రాష్ట్ర రాజ‌ధాని అగ‌ర్త‌లా నుండి 190 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న ఉత్త‌ర త్రిపుర లోని ధ‌ర్మ‌న‌గ‌ర్ కు మొద‌ట ప్ర‌యాణించే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం.

ఇక రెండో ర‌థ జాత‌ర‌ను త్రిపుర లోని స‌బ్రూమ్ నుంచి ప్రారంభించ‌నున్నారు.

Also Read : గ‌వ‌ర్న‌ర్ అన‌సూయ‌పై సీఎం గుస్సా

Leave A Reply

Your Email Id will not be published!