Amit Shah : బీఆర్ఎస్ సర్కార్ బేకార్ – అమిత్ షా
దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం
Amit Shah : జనగాం – కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా షాకింగ్ కామెంట్స్ చేశారు. దేశంలో అత్యంత అవినీతి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలంగాణ సర్కార్ అని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎం లాగా మారి పోయిందన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కేసీఆర్ కుటుంబంపై విచారణ జరుపుతామని స్పష్టం చేశారు.
Amit Shah Shocking Comments
తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం జనగాం లో జరిగిన బీజేపీ విజయ సంకల్ప సభలో పాల్గొని ప్రసంగించారు అమిత్ చంద్ర షా(Amit Shah). ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించనున్నాయని అన్నారు. బీఆర్ఎస్ పార్టీని 2జీగా అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీని 3జీగా పేర్కొన్నారు. ఎంఐఎం పార్టీని 5జీగా ఎద్దేవా చేశారు అమిత్ షా.
ఆరు నూరైనా సరే తాము అధికారంలోకి రావడం ఖాయమని పేర్కొన్నారు. ప్రస్తుతం జరిగే ఎన్నికల్లో తాము కీలకమైన పాత్ర పోషించ బోతున్నామని జోష్యం చెప్పారు కేంద్ర హోం శాఖ మంత్రి. 119 నియోజకవర్గాలలో కనీసం 30 నియోజకవర్గాలను శాసించ బోతున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి అంత సీన్ లేదన్నారు. ఇవాళ జరగబోయే పోరాటం కేవలం బీఆర్ఎస్ , బీజేపీ మధ్యనే ఉంటుందన్నారు.
Also Read : Chandra Babu Case : బాబుకు రిలీఫ్ బెయిల్ మంజూరు