Anirudh Reddy : కాంగ్రెస్ పార్టీలో లేఖల కలకలం
అనిరుధ్ రెడ్డి ఘాటు అస్త్రం
Anirudh Reddy : కాంగ్రెస్ పార్టీలో రోజు రోజుకు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. సీనియర్లు గంపగుత్తగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. మర్రి శశి ధర్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు.
30 ఏళ్లుగా పార్టీ కోసం పని చేసిన వ్యక్తిని కాదని మూడేళ్ల కిందట వచ్చిన వాళ్లకు ఎలా పదవి కట్ట బెడతారంటూ ప్రశ్నించారు. ఇదే సమయంలో రేవంత్ రెడ్డికి మాణిక్యం ఠాగూర్ ఏజెంట్ గా పని చేస్తున్నాడంటూ ఆరోపణలు చేశారు.
ప్రస్తుతం ఈ కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. తాజాగా ఉమ్మడి పాలమూరు జిల్లా జడ్చర్లకు చెందిన కాంగ్రెస్ నాయకుడు, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అనుచరుడిగా ముద్ర పడిన అనిరుధ్ రెడ్డి(Anirudh Reddy) లేఖాస్త్రం సంధించారు.
ఆయన ఏకంగా మాణిక్యం ఠాగూర్ కు ఆరోపణలు చేస్తూ పేర్కొన్నారు. ఆయన ప్రధానంగా ఇటీవల పార్టీలో చేరిన ఎర్రశేఖర్ గురించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఘాటుగా ప్రశ్నిస్తూ లేఖ రాయడం కలకలం రేపింది. శేఖర్ చేరికను ముందు నుంచీ వ్యతిరేకిస్తూ వచ్చారు అనిరుధ్ రెడ్డి. సొంత తమ్ముడినే హత్య చేసిన వ్యక్తిని ఎలా చేర్చుకుంటారంటూ ప్రశ్నించారు.
9 మర్డర్ కేసుల్లో ఎర్ర శేఖర్ కు సంబంధం ఉందంటూ ఆరోపించారు. అలాంటి నేర ఆరోపణలు కలిగిన వ్యక్తితో తాను స్టేజ్ పంచు కోలేనని పేర్కొన్నారు.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అనుచరుడిని కాబట్టే తనను ఇబ్బందికి గురి చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఇక్కడ పోటీలో ఉంటే పార్టీకి ప్లస్ అవుతుందని లేక పోతే మరో హుజూరాబాద్ అవుతుందన్నారు.
మరో వైపు మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి హై కమాండ్ కు లేఖ రాశారు.
Also Read : నిర్వాహకుల కమిటీపై సుప్రీంకోర్టు నిషేధం