Bandi Sanjay : కేసీఆర్ పై బండి క‌న్నెర్ర‌

మోదీ చేసిన ఆరోప‌ణ‌లు త‌ప్ప‌ని నిరూపించాలి

Bandi Sanjay : హైద‌రాబాద్ – భార‌తీయ జ‌న‌తా పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి , క‌రీంన‌గ‌ర్ ఎంపీ, బీజేపీ మాజీ చీఫ్ బండి సంజ‌య్ కుమార్(Bandi Sanjay) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ సీఎం కేసీఆర్ పై చేసిన వ్యాఖ్య‌లు వంద శాతం నిజ‌మేన‌ని స్ప‌ష్టం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు.

Bandi Sanjay Serious on KCR

తడి బ‌ట్ట‌ల‌తో తాను బ‌య‌ట‌కు వ‌చ్చాన‌ని, ద‌మ్ముంటే సీఎం కేసీఆర్ త‌డి బ‌ట్ట‌ల‌తో న‌గ‌రంలోని భాగ్య‌లక్ష్మి అమ్మ వారి గుడిలోకి రావాల‌ని, ప్ర‌మాణం చేయాల‌ని స‌వాల్ విసిరారు. ఆచ‌ర‌ణ‌కు నోచుకోని హామీల‌తో ప్ర‌జ‌ల‌ను బురిడీ కొట్టిస్తున్న బీఆర్ఎస్ కు రాబోయే ఎన్నిక‌ల్లో శిక్ష త‌ప్ప‌ద‌న్నారు.

జ‌నం మార్పు కోరుకుంటున్నార‌ని, రాబోయే కాలం త‌మ‌దేన‌ని జోష్యం చెప్పారు. తండ్రీ కొడుకులు, అల్లుళ్లు, బిడ్డ ఇలా చెప్పుకుంటూ పోతే క‌ల్వ‌కుంట్ల కాందాన్ చ‌రిత్ర చాలా ఉంద‌న్నారు. చెప్పాలంటే క‌నీసం ఒక ఏడాది స‌మ‌యం ప‌డుతుంద‌న్నారు బండి సంజ‌య్ కుమార్ .

కేసీఆర్ మేక పోతు గాంభీర్యం ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని , కానీ రాబోయే అధికారం త‌మ‌దేన‌ని జోష్యం చెప్పారు బీజేపీ మాజీ చీఫ్‌.

Also Read : Minister Kakani : వైసీపీ ప్రభుత్వ పనితీరుపై ఏపీ ప్రజలు సంతృప్తిగా ఉన్నారు

Leave A Reply

Your Email Id will not be published!