Bandi Sanjay : తెలంగాణ‌కు ఏం చేసిన‌వో చెప్పు – బండి

సీఎం కేసీఆర్ కు బీజేపీ చీఫ్ స‌వాల్

Bandi Sanjay : భార‌తీయ జ‌న‌తా పార్టీ చీఫ్ బండి సంజ‌య్ నిప్పులు చెరిగారు సీఎం కేసీఆర్ పై. దేశ రాజ‌కీయాలు త‌ర్వాత ముందు తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసిన‌వో చెప్పాల‌ని డిమాండ్ చేశారు. శ‌నివారం బండి సంజ‌య్ మీడియాతో మాట్లాడారు.

కోరి తెచ్చుకున్న తెలంగాణ‌లో మ‌న‌భంగాలు, మ‌ర్డ‌ర్లు, క‌బ్జాలు, కేసులు , దౌర్జ‌న్యాలే త‌ప్ప ఏముంది ఈ రాష్ట్రంలో అని నిల‌దీశారు. ప్ర‌జ‌ల‌ను మభ్య పెట్టేందుకు టైం పాస్ రాజ‌కీయాలు చేస్తున్నాడ‌ని ఎద్దేవా చేశారు.

ప్ర‌జాస్వామ్యంలో ఎవ‌రైనా పార్టీ పెట్టుకోవ‌చ్చ‌న్నారు. కానీ ఇక్క‌డ సీఎంగా కొలువు తీరిన కేసీఆర్ పాల‌న‌లో చెప్పుకునేందుకు ఏమీ లేద‌న్నారు. అంతా అవినీతి, అక్ర‌మాలే త‌ప్ప ఇంకొకటి క‌నిపించడం లేద‌న్నారు బండి సంజ‌య్(Bandi Sanjay).

ఇదే స‌మ‌యంలో ఆయ‌న స‌వాల్ కూడా విసిరారు. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ఎనిమిదేళ్ల పాల‌న‌పై అదే స‌మ‌యంలో తెలంగాణా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాల‌న‌పై చ‌ర్చ‌కు సిద్దమా అని ప్ర‌శ్నించారు.

దేశంలో వార‌స‌త్వ పునాదుల‌పై, అవినీతినే ఆధారంగా చేసుకున్న పార్టీలు పూర్తిగా క‌నుమ‌రుగై పోతున్నాయ‌ని జోస్యం చెప్పారు. సీఎం కేసీఆర్ కు అంత సీన్ లేద‌న్నారు.

తెలంగాణ వ‌చ్చాక ఏదో చేస్తాడ‌ని అనుకుంటే కుటంబాన్ని కేంద్రీకృతంగా పాల‌న సాగిస్తున్నాడ‌ని ఆరోపించారు. రాష్ట్రాన్ని కులాలు, మ‌తాలు, వ‌ర్గాల పేరుతో విచ్చిన్నం చేసిన ఘ‌న‌త కేసీఆర్ కే ద‌క్కుతుంద‌న్నారు బండి సంజ‌య్(Bandi Sanjay).

ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల‌ను ఈరోజు వ‌ర‌కు అమ‌లు చేసిన పాపాన పోలేద‌న్నారు. 2 ల‌క్ష‌ల ఖాళీలుంటే ఇప్ప‌టి వ‌ర‌కు భ‌ర్తీ చేసిన‌వా అని నిల‌దీశారు బీజేపీ చీఫ్‌.

Also Read : బీఎస్పీ చీఫ్ గా ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్

Leave A Reply

Your Email Id will not be published!