Bandi Sanjay : అవినీతిలో అదుర్స్ పాలనలో బేవార్స్ – బండి
రాష్ట్రాన్ని దోచుకుంటున్న కుటుంబం
Bandi Sanjay : భారతీయ జనతా పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. అవినీతి, అక్రమాలలో కేసీఆర్ అనకొండను మించి పోయాడన్నారు. నమ్మి పవర్ చేతికి ఇస్తే సర్వ నాశనం చేశాడని ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయిన రోజున తెలంగాణకు మిగులు బడ్జెట్ ఉండేదన్నారు. కానీ ఇవాళ 4 లక్షల కోట్ల అప్పు మిగిల్చాడంటూ మండిపడ్డారు బండి సంజయ్(Bandi Sanjay).
అన్ని స్కాంలలో కల్వకుంట్ల కుటుంబం కూరుకు పోయిందన్నారు. ఏది బయటకు వచ్చినా ముందు ప్రగతి భవన్ వైపు దర్యాప్తు సంస్థలు చూడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. తెలంగాణ పరువు తీసిన ఎమ్మెల్సీ కవిత వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పొద్దస్తమానం చిలుక పలుకులు పలికిన ఈ బతుకమ్మ ఇప్పుడు తమ పార్టీపై నిందలు మోపడం దారుణమన్నారు.
లాండ్ , సాండ్ , లిక్కర్ , గ్రానైడ్ , క్యాసినో , డ్రగ్స్ దందాల్లో కల్వకుంట్ల ఫ్యామిలీ పాత్ర ఉందని సంచలన ఆరోపణలు చేశారు బీజేపీ స్టేట్ చీఫ్. కృష్ణా నీటి వాటాలో 299 టీఎంసీలకే సంతకం చేసి తెలంగాణకు అన్యాయం చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. తన గోతి తానే తవ్వుకుంటున్నాడని ఇక కేసీఆర్ ను ఎవరూ కాపాడలేరని జోష్యం చెప్పారు.
సీఎం అయితే ఏంటి..ఆమె కూతురు అయితే ఏంటి..ఎవరైనా చట్టం ముందు సమానులేనని అన్నారు. ఆమె ఏమైనా ఫ్రీడం ఫైటరా ..బరా బర్ కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ చేపడతాయని స్పష్టం చేశారు బండి సంజయ్(Bandi Sanjay). తప్పు చేసిన కవిత కోసం ప్రజలు ఎందుకు ఆందోళన చేయాలని ప్రశ్నించారు.
Also Read : దేశం చూపు ‘రాహుల్’ వైపు