Bandi Sanjay : ఇక్క‌డ చెల్ల‌నోడు దేశాన్ని ఏం ఉద్ద‌రిస్త‌డు

కేసీఆర్ పై నిప్పులు చెరిగిన బండి సంజ‌య్

Bandi Sanjay : బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజ‌య్ కుమార్(Bandi Sanjay)  ప‌టేల్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఆయ‌న చేప‌ట్టిన ప్రజా సంగ్రామ యాత్ర జ‌గిత్యాల జిల్లా మెట్ ప‌ల్లిలో కొన‌సాగుతోంది. ఈ సంద‌ర్బంగా ప్ర‌జ‌లను ఉద్దేశించి ప్ర‌సంగించారు. తెలంగాణ‌లో చెల్ల‌ని రూపాయిగా మారి పోయిండు కేసీఆర్.

ఇక ఇక్క‌డ ఉద్ద‌రించ లేనోడు దేశాన్ని ఏలేటేందుకు పోతా అంటున్న‌డు అంటూ ఎద్దేవా చేశారు బండి సంజ‌య్. ఏరి కోరి తెలంగాణను అప్ప‌గిస్తే మిగులు బ‌డ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్ప‌గా మార్చాడంటూ ఆరోపించారు. కొడుకు డ్ర‌గ్స్ , బిడ్డ లిక్క‌ర్ తండ్రేమో అబద్దాలు చెప్ప‌డంలో దిట్ట అని మండిప‌డ్డారు.

తాను చేసిన సవాళ్ల‌ను ఎవ‌రూ స్వీక‌రించేందుకు రావ‌డం లేద‌న్నారు. టీఆర్ఎస్ ర‌ద్దుతో తెలంగాణ‌కు ఉన్న శ‌ని పోయింద‌న్నారు బండి సంజ‌య్. పార్టీ పేరుతో తెలంగాణ‌ను కూడా తీసి వేసిండ‌ని ఎద్దేవా చేశారు బీజేపీ స్టేట్ చీఫ్. సొల్లు క‌బుర్లు పుక్కిటి పురాణాలు చెప్ప‌డంలో కేసీఆర్ నెంబ‌ర్ వ‌న్ అని అన్నారు.

ప్ర‌జ‌ల‌ను మాయ మాట‌ల‌తో నమ్మించ‌డంలో స‌క్సెస్ అయ్యాడ‌ని కానీ వారు త‌మ‌కు జ‌రిగిన మోసం గురించి తెలుసుకున్నార‌ని అన్నారు బండి సంజ‌య్ . రాబోయే ఎన్నిక‌ల్లో క‌ర్ర కాల్చి వాత పెట్ట‌డం ఖాయ‌మ‌న్నారు.

ఉద్య‌మ స‌మ‌యంలో, అధికారంలోకి వ‌చ్చాక ఇచ్చిన హామీలు ఎంత వ‌ర‌కు నెర‌వేర్చాడో శ్వేత ప‌త్రం విడుద‌ల చేయాల‌ని బీజేపీ స్టేట్ చీఫ్ డిమాండ్ చేశారు. ఏదో ఒక రోజు పెట్టే బేడా స‌ర్దుకోవాల్సి రావ‌డం ఖాయ‌మ‌న్నారు.

Also Read : బీజేపీ కుట్ర‌లో భాగ‌మే బీఆర్ఎస్ – రేవంత్

Leave A Reply

Your Email Id will not be published!