Bandi Sanjay : హిందూ ధ‌ర్మాన్ని కించప‌రిస్తే జాగ్ర‌త్త‌

కించ‌ప‌రిస్తే ఊరుకునే ప్ర‌స‌క్తి లేదు

Bandi Sanjay : భార‌తీయ జ‌న‌తా పార్టీ చీఫ్ బండి సంజ‌య్(Bandi Sanjay) షాకింగ్ కామెంట్స్ చేశారు. హిందూ ధ‌ర్మాన్ని కించ ప‌ర్చ‌డం ఈ మ‌ధ్య ఓ ఫ్యాష‌న్ గా మారింద‌ని మండిప‌డ్డారు. అంతే కాదు తెలంగాణ రాష్ట్రం హ‌బ్ గా త‌యారైంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు బీజేపీ స్టేట్ చీఫ్‌. ఈ దేశంలో పుట్టిన ప్ర‌తి ఒక్క‌రు దేవుడిని మొక్క‌డం య‌ధావిధిగా కొన‌సాగుతూ వ‌స్తుంద‌న్నారు బీజేపీ స్టేట్ చీఫ్‌.

కొంద‌రు కావాల‌ని దేవుడిని కించ‌ప‌ర్చేందుకు య‌త్నిస్తున్నారంటూ ఆరోపించారు బండి సంజ‌య్. తాజాగా అయ్య‌ప్ప స్వామిని కించ ప‌రిచే విధంగా కొంద‌రు మాట్లాడుతున్నారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇక నుంచి హిందూ ధ‌ర్మాన్ని లేదా హిందూ దేవుళ్ల‌ను తూల నాడితే ఊరుకునే ప్ర‌స‌క్తి లేద‌ని హెచ్చ‌రించారు బీజేపీ స్టేట్ చీఫ్‌(Bandi Sanjay).

హిందూ ధ‌ర్మం విష‌యంలో వ్య‌క్తులు కానీ లేదా ఇత‌ర సంస్థ‌లు కించ ప‌రిచేందుకు ప్ర‌య‌త్నం చేస్తే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌న్నారు బండి సంజ‌య్. బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ ప‌రిష‌త్ , హిందూ సంఘాలు హిందువుల‌కు అండ‌గా ఉంటాయ‌ని, ఎవ‌రు కించ ప‌రిచేందుకు య‌త్నించినా తాట తీస్తామ‌ని హెచ్చ‌రించారు.

ఇక నుంచి హిందూ సంఘాలు ఊరుకోబోవ‌మ‌న్నారు. ఆయ‌న ఇందుకు సంబంధించి కీల‌క పిలుపు ఇచ్చారు బీజేపీ స్టేట్ చీఫ్ . ఏ పార్టీకి చెందిన వారైనా హిందువుల‌ను విమ‌ర్శించినా లేదా కించ ప‌రిచేలా చూసినా ఊరుకోవ‌ద్దంటూ కోరారు బీజేపీ స్టేట్ చీఫ్‌. ప్ర‌స్తుతం బండి సంజ‌య్ చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి.

Also Read : గ్రూప్ -2లో కీల‌క మార్పులు

Leave A Reply

Your Email Id will not be published!