Prashant Kishor : ప్ర‌శాంత్ కిషోర్ తో నితీష్ కుమార్ భేటీ

చ‌ర్చ‌నీయాంశంగా మారిన దిగ్గ‌జాల క‌ల‌యిక‌

Prashant Kishor : దేశ రాజ‌కీయాల‌ను ప్ర‌భావితం చేస్తున్న ఇండియ‌న్ పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్ట్ ప్ర‌శాంత్ కిషోర్(Prashant Kishor) ఇవాళ త‌న మాజీ బాస్, ప్ర‌స్తుత బీహార్ సీఎం నితీష్ కుమార్ క‌లుసుకున్నారు.

వీరిద్ద‌రూ క‌లిసి భోజ‌నం చేశారు. ప్ర‌స్తుతం ఇది చ‌ర్చ‌కు దారి తీసింది. ఇదిలా ఉండ‌గా సీఎం నితీష్ కుమార్ తో స‌మావేశ‌మైన మాట వాస్త‌వ‌మేన‌ని పేర్కొన్నారు.

ఆ విష‌యాన్ని ధ్రువీక‌రించారు ప్రశాంత్ కిషోర్.  ఇదిలా ఉండ‌గా ఇవాళ ఢిల్లీలో పీకేను క‌లిసిన మాట వాస్త‌వ‌మేన‌ని స్ప‌ష్టం చేశారు బీహార్ సీఎం నితీష్ కుమార్.

మ‌మ‌తా బెన‌ర్జీ తృణ‌మూల్ కాంగ్రెస్ తో త‌న భ‌విష్య‌త్తుపై తీవ్ర ఊహాగానాలు వినిపిస్తున్న త‌రుణంలో రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ త‌న మాజీ బాస్ నితీష్ కుమార్ తో క‌లిసి భోజ‌నం చేయ‌డం అత్యంత ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

ఇదిలా ఉండ‌గా ప్ర‌శాంత్ కిషోర్ తో తాను భేటీ అయ్యింది వాస్త‌వ‌మేన‌ని , చెప్పుకోద‌గ్గ చ‌ర్చ‌లు ఏవీ జ‌ర‌గ లేద‌న్నారు నితీష్‌ కుమార్. 2020లో నితీష్ కుమార్ త‌న పార్టీ నంబ‌ర్ 2గా ఉన్న ప్రశాంత్ కిషోర్(Prashant Kishor) ను తొల‌గించారు.

ఆ త‌ర్వాత మొద‌టిసారిగా క‌లుసుకున్నారు. వీరిద్ద‌రూ ఢిల్లీలోని బీహార్ సీఎం త‌న అధికారిక నివాసంలో రెండు గంట‌ల పాటు స‌మావేశం అయ్యారు.

అయితే త‌న‌కు ప్ర‌శాంత్ కిషోర్ తో త‌న‌కు స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయ‌ని స్ప‌ష్టం చేశారు సీఎం నితీష్ కుమార్. త‌న‌కు ఆరోగ్యం బాగా లేద‌ని తెలుసుకుని ఫోన్ చేశార‌ని తెలిపారు.

Also Read : జ‌గ్గ‌న్న పార్టీలోనే ఉంటారు – రేవంత్

Leave A Reply

Your Email Id will not be published!