Sanjay Raut : మూవీస్ ప్ర‌మోష‌న్స్ లో బీజేపీ బిజీ – రౌత్

శివ‌సేన స్పోక్స్ ప‌ర్స‌న్ షాకింగ్ కామెంట్స్

Sanjay Raut : శివ‌సేన పార్టీ జాతీయ అధికార ప్ర‌తినిధి, ఎంపీ సంజ‌య్ రౌత్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఆయ‌న మ‌రోసారి కేంద్రంపై నిప్పులు చెరిగారు.

ఓ వైపు దేశంలో స‌మ‌స్య‌లు పేరుకు పోతుంటే బీజేపీ, కేంద్ర స‌ర్కార్ మాత్రం కొన్ని సినిమాల‌ను ప్ర‌మోష‌న్ చేయ‌డాన్ని ప‌నిగా పెట్టుకుందంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు.

ఆయ‌న కాశ్మీర్ ఫైల్స్ మూవీని మోదీ, ఆయ‌న ప‌రివారం, పార్టీ, సంస్థ‌ల‌న్నీ ఆహా ఓహో అంటూ కీర్తించ‌డం, ఆయా రాష్ట్రాల‌లో ప‌నిగ‌ట్టుకుని ప్ర‌చారం చేశార‌ని ధ్వ‌జ‌మెత్తారు.

ఇదే కాశ్మీరీ పండిట్ల‌పై కాశ్మీర్ లోయ‌ల్ ఉగ్ర‌వాదులు పిట్ట‌ల్ని కాల్చిన‌ట్లు దాడుల‌కు తెగ బ‌డుతుంటే నిద్ర పోతున్నారా అని ప్ర‌శ్నించారు సంజ‌య్ రౌత్(Sanjay Raut). స‌మావేశాలు నిర్వ‌హించ‌డం వ‌ల్ల లాభం లేద‌ని, దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని సూచించారు.

ఓ వైపు కాశ్మీర్ లోయ‌లో భ‌ద్ర‌త గాలిలో దీపం లా మారింద‌న్నారు. సినిమాల‌ను నెత్తికి ఎక్కించు కోవ‌డం మానేసి వాస్త‌వ ప‌రిస్థితుల గురించి ఆలోచించాల‌ని స్ప‌ష్టం చేశారు సంజ‌య్ రౌత్.

ఓ వైపు బాధితులంతా రోడ్ల‌పైకి వ‌చ్చార‌ని ఈ ఒక్క నెల‌లో ల‌క్ష్యంగా చేసుకుని దాడుల‌కు పాల్ప‌డడంతో ఏకంగా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

నిన్న‌టి వ‌ర‌కు కాశ్మీర్ ఫైల్స్ మూవీస్ ప్ర‌మోష‌న్ లో బిజీగా ఉన్న ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ , కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ షా ఇప్పుడు ఎందుకు నోరు మెద‌ప‌డం లేద‌ని నిల‌దీశారు.

బాధ్య‌త క‌లిగిన ప‌ద‌వుల్లో ఉన్న మీరు ఈ విప‌త్క‌ర స‌మ‌యంలో మౌనం వ‌హించ‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు.

Also Read : బీజేపీ దృష్టిలో అన్ని మతాలు ఒక్క‌టే

Leave A Reply

Your Email Id will not be published!