Manish Sisodia : బీజేపీ నిరక్షరాస్యుల పార్టీ – సిసోడియా
సంచలన కామెంట్స్ చేసిన డిప్యూటీ సీఎం
Manish Sisodia : కేంద్రంలో కొలువు తీరిన భారతీయ జనతా పార్టీపై మరోసారి నిప్పులు చెరిగారు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా(Manish Sisodia). ఆప్, బీజేపీ ల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది.
ఎంత సేపు, కులాలు, మతాలు, ప్రాంతాలు, వర్గాలు, దేవుళ్ల పేరుతో రాజకీయం చేయడం తప్పా ఒరిగింది ఏమీ లేదంటూ మండిపడ్డారు సిసోడియా.
ఈ సందర్భంగా బీజేపీ శ్రేణులకు, ఆ పార్టీకి చెందిన సంస్థలకు విద్య , వైద్యం, ఉపాధి, పరిశ్రమల ఏర్పాటు, మహిళా సాధికారత అన్న ఆలోచనలు ఉండవని ఎద్దేవా చేశారు.
వారికి ఎంత సేపు ప్రభుత్వాలను కూల్చడం, మత ఘర్షణలను సృష్టించడం తప్ప ఇంకేమీ ఉండదన్నారు. ఒక రకంగా పీఎం కొలువు తీరిన ఈ ఎనిమిదేళ్ల కాలంలో ప్రోగ్రెస్ రిపోర్ట్ చూస్తే ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ప్రభుత్వ ఆస్తులను అమ్మకం , దేశాన్ని కార్పొరేట్ లు, బడా వ్యాపారులకు అమ్మడం తప్ప చేసింది ఏమీ లేదన్నారు సిసోడియా.
బీజేపీ ఎందుకు నిరక్షరాస్యుల పార్టీ అనేది చెప్పారు డిప్యూటీ సీఎం(Manish Sisodia). ఎందుకంటే బీజేపీ పాలిత రాష్ట్రాలలో చదువుకు ప్రాధాన్యత ఉండదన్నారు.
ఉన్న బడులను మూసి వేయడం లేదంటే వ్యాపారవేత్తలకు అప్పగించడం మాత్రమే చేస్తూ వస్తున్నాయని ఆరోపించారు.
కానీ మీరు ఒక్కసారి ఢిల్లీకి వచ్చి చూడండి. మేం దేశానికే ఆదర్శ ప్రాయంగా ఉన్నామని చెప్పారు సిసోడియా. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ షాకింగ్ కామెంట్స్ చేశారు.
బీజేపీ పాలనలో ప్రభుత్వ పాఠశాలలు ఎందుకు మూత పడ్డాయో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.
Also Read : జార్ఖండ్ ఎమ్మెల్యేలు గెస్ట్ హౌస్ కు తరలింపు