BJP Manifesto : 500 రోజుల్లో మునుగోడు పురోభివృద్ది
ఉప ఎన్నిక వేళ బీజేపీ మేనిఫెస్టో రిలీజ్
BJP Manifesto : తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఉన్నా మునుగోడులో ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో హామీల వర్షం కురుస్తోంది. బరిలో పలువురు ఉన్నా ప్రధాన పోటీ మాత్రం టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్యే ఉంటోంది. అన్ని పార్టీలు లెక్కించ లేనన్ని హామీలు గుప్పిస్తున్నారు.
అర చేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. ఈ తరుణంలో కేంద్రంలో కొలువు తీరిన భారతీయ జనతా పార్టీ తమ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తే మునుగోడును ఏ రకంగా అభివృద్ది చేస్తామో ముందుగానే ప్రకటించింది. ఈ మేరకు బీజేపీ మేనిఫెస్టోను(BJP Manifesto) విడుదల చేసింది. గెలుపొందిన వెంటనే 500 రోజుల్లో మునుగోడును అద్దం కంటే అందంగా అభివృద్ది చేస్తామని పేర్కొంది.
కేంద్రం పెద్దలతో చర్చించిన తర్వాత ఈ హామీ ఇస్తున్నట్లు ప్రకటించారు పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి. నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ది చెందాలంటే బీజేపీయే శ్రీరామ రక్ష అని స్పష్టం చేశారు. రాష్ట్రం బాగు పడాలంటే తమ వల్ల మాత్రమే సాధ్యమవుతుందని చెప్పారు. కాంట్రాక్టర్లు ప్రస్తుతం టెండర్లు వేసే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి( Komatireddy Rajgopal Reddy).
రూ. 200 కోట్లతో రోడ్లు వేయిస్తామని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా టెక్స్ టైల్ పార్కుతో పాటు చరూ. 25 కోట్లతో ఐటీఊ ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు. రూ. 100 కోట్లో మూసీ నీటిని ఇక్కడికి తీసుకు వస్తామన్నారు. నిరుద్యోగుల కోసం నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.
Also Read : డ్రామారావు ఆటలు సాగవు