Mamata Banerjee : బీజేపీ జైలును బ‌ద్ద‌లు కొట్టాలి – దీదీ

2024 ఎన్నిక‌ల్లో ఓట‌మి ఖాయం

Mamata Banerjee : తృణ‌మూల్ కాంగ్ర‌స్ పార్టీ చీఫ్‌, ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఆమె మ‌రోసారి కేంద్ర స‌ర్కార్ పై నిప్పులు చెరిగారు. బీజేపీ జైలును బ‌ద్ద‌లు కొట్టాల‌ని పిలుపునిచ్చారు దీదీ.

వ‌చ్చే 2024లో జ‌రిగే ఎన్నిక‌ల్లో దేశంలో కాషాయం తుడిచి పెట్టుకు పోవడం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు. అమ‌ర వీరుల దినోత్స‌వం సంద‌ర్భంగా రాష్ట్రంలోని కోల్ క‌తాలో భారీ ర్యాలీ చేప‌ట్టారు.

ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన స‌మావేశంలో మ‌మ‌తా బెన‌ర్జీ(Mamata Banerjee) ప్ర‌సంగించారు. ఈ దేశాన్ని స‌ర్వ‌నాశ‌నం చేసేందుకు బీజేపీ కంక‌ణం క‌ట్టుకుంద‌ని ఆరోపించారు.

బీజేపీయేత‌ర రాష్ట్రాల‌ను టార్గెట్ గా పెట్టుకుని ప‌ని చేస్తోంద‌న్నారు. బీజేపీది ప్ర‌జా వ్య‌తిరేక ప్ర‌భుత్వ‌మ‌ని పేర్కొన్నారు. తృణ ధాన్యాలు, పప్పులు, పిండి వంటి ప్రీ ప్యాక్డ్ , లేబుల్ చేయ‌బ‌డిన ఆహారం కోసం 5 శాతం జీఎస్టీ విధించ‌డాన్ని ఆమె త‌ప్పు ప‌ట్టారు.

ఇంకెంత కాలం ఈ దేశాన్ని, ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తారంటూ ప్ర‌శ్నించారు. గూడ్స్ అండ్ స‌ర్వీసెస్ టాక్స్ ను పెంచడాన్ని ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. బీజేపీ జైలు ఊచ‌ల‌ను బ‌ద్ద‌లు కొట్టాలి.

రాబోయే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ప్ర‌జా ప్ర‌భుత్వాన్ని తీసుకు రావాలంటూ పిలుపునిచ్చారు సీఎం మమ‌తా బెన‌ర్జీ. ప్ర‌జ‌లు సిద్దంగా ఉన్నారు ఓడించేందుకు వారు ఓడి పోవ‌డం ఖాయ‌మ‌న్నారు.

బీజేపీకి సింగిల్ మెజారిటీ కూడా రాద‌ని తాను ఘంటాప‌థంగా చెప్ప‌గ‌ల‌న‌న్నారు సీఎం. ప్ర‌తి దానికీ జీఎస్టీ విధిస్తూ పోతే పేద‌లు ఎలా బ‌తుకుతారంటూ ప్ర‌శ్నించారు దీదీ.

Also Read : ఫేస్ బుక్ భ‌ద్ర‌త ప‌ట్ల‌ మ‌హిళ‌ల ఆందోళ‌న

Leave A Reply

Your Email Id will not be published!