Botsa Satyanarayana : టీడీపీకి అంత సీన్ లేదు – బొత్స

చంద్ర‌బాబుపై రాష్ట్ర మంత్రి ఫైర్

Botsa Satyanarayana : చంద్ర‌బాబు నాయుడు క‌లలు కంటున్నారు. అవి నిజం కావ‌ని ఆయ‌న‌కు తెలుసు. ఎందుకంటే ఏపీలో వైస్సార్సీపీకి తిరుగు లేదు. సీఎం సందింటి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ఎదురు లేదు. బాబు ఎన్ని జిమ్మిక్కులు చేసినా వ‌ర్క‌వుట్ కాద‌న్నారు రాష్ట్ర మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌. టీడీపీకి రాష్ట్రంలో అంత సీన్ లేద‌ని ఎద్దేవా చేశారు.

రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన ఘ‌న‌త బాబుదేన‌ని మండిప‌డ్డారు. ఇవాళ దేశంలో ఎక్క‌డా లేని రీతిలో సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్న ఘ‌న‌త త‌మ స‌ర్కార్ కే ద‌క్కుతుంద‌న్నారు బొత్స స‌త్య‌నారాయ‌ణ‌(Botsa Satyanarayana).

మామ ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన చంద్ర‌బాబు నాయుడు ఇప్పుడు చిలుక ప‌లుకులు ప‌లుకుతున్నాడ‌ని ఆయ‌న చేసిన మోసాన్ని ప్ర‌జ‌లు ఎలా మ‌రిచి పోతార‌ని ప్ర‌శ్నించారు మంత్రి. బీసీల‌ను తాను ఉద్ద‌రించిన‌ట్లు గొప్ప‌లు చెప్పుకుంటున్నాడ‌ని మండిప‌డ్డారు. చంద్ర‌బాబు నాయుడు ప‌నై పోయింద‌ని, టీడీపీకి భ‌విష్య‌త్తు లేద‌న్నారు బొత్స స‌త్య‌నారాయ‌ణ‌.

వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తులు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీల‌కు పెద్ద పీట వేసింది తామేన‌న్నారు. అన్ని వ‌ర్గాల వారికి రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించిన ఘ‌న‌త సీఎం జ‌గ‌న్ రెడ్డికి ద‌క్కుతుంద‌న్నారు. ఆయ‌న ఎన్ని చెప్పినా జ‌నం వినిపించుకునే స్థితిలో లేర‌ని జోష్యం చెప్పారు. టీడీపీ హ‌యాంలో ఏదైనా ఒక్క మంచి ప‌నైనా చేశారా అని నిల‌దీశారు. ఉంటే త‌న‌కు చెప్పాల‌ని డిమాండ్ చేశారు బొత్స స‌త్య‌నారాయ‌ణ‌.

రాజ‌ధాని పేరుతో రాజ‌కీయం చేశార‌ని, ఆపై రియ‌ల్ ఎస్టేట్ దందాకు పాల్పడ్డారంటూ మంత్రి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. 14 ఏళ్ల పాల‌న‌లో మోసం తప్ప చేసింది ఏమీ లేద‌న్నారు.

Also Read : తెలంగాణ‌కు రానున్న రాష్ట్ర‌ప‌తి

Leave A Reply

Your Email Id will not be published!