BRO Movie Team Visit : దుర్గ‌మ్మ స‌న్నిధిలో బ్రో టీమ్

బ్రో టీమ్ లో న‌టుడు, ద‌ర్శ‌కుడు

BRO Movie Team Visit : విజ‌య‌వాడ క‌న‌క‌దుర్గ ఆల‌యాన్ని ద‌ర్శించుకున్నారు సినీ న‌టుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ , బ్రో ది వారియ‌ర్ ద‌ర్శ‌కుడు సముద్ర ఖ‌ని. అమ్మ వారికి పూజ‌లు చేశారు. అంత‌కు ముందు న‌టుడు, ద‌ర్శ‌కుడికి పూజారులు స్వాగ‌తం ప‌లికారు(BRO Movie Team Visit). ఆశీర్వ‌చ‌నం అంద‌జేశారు. సాయి ధ‌ర‌మ్ తేజ్ తో పాటు మిగ‌తా టీం కూడా ఇక్క‌డికి విచ్చేసింది.

BRO Movie Team Visit Temple

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో పాటు సాయి ధ‌ర‌మ్ తేజ్ , కేతి శ‌ర్మ‌, ప్రియా వారియ‌ర్ క‌లిసి న‌టించారు బ్రో(BRO) ది వారియ‌ర్. జూలై 28న ఈ సినిమాను విడుద‌ల చేశారు. ఊహించ‌ని రీతిలో సినిమా స‌క్సెస్ అయ్యింది. కోట్లు కొల్ల‌గొడుతోంది. ప్ర‌తి చోటా స‌క్సెస్ టాక్ తెచ్చుకుంది. దీంతో ప‌వ‌న్ ఫ్యాన్స్ తెగ సంబ‌ర‌ప‌డి పోతున్నారు.

ఈ చిత్రం త‌మిళంలో విజ‌యంత‌మైన సినిమా. ఆ సినిమాకు కూడా స‌ముద్ర‌ఖ‌ని ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఇక తెలుగులో స‌ముద్ర ఖ‌ని న‌టించి, ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. స్క్రీన్ ప్లే మొత్తం త్రివిక్రమ్ శ్రీ‌నివాస్ చేశాడు. మాట‌లు కూడా ఆయ‌నే రాశాడు. ప్ర‌స్తుతం బ్రో ది అవతార్ కేవ‌లం డైలాగుల కోసం జ‌నం ఆద‌రిస్తున్నారు. భారీ ఎత్తున అక్కున చేర్చుకుంటున్నారు.

చిత్రానికి సంబంధించి ఎస్ఎస్ త‌మ‌న్ ఇచ్చిన మ్యూజిక్ హైలెట్ గా నిలిచింది. బ్రో ది వారియ‌ర్ స‌క్సెస్ కావ‌డంతో ఇందులో న‌టించిన సాయి ధ‌ర‌మ్ తేజ్ , ద‌ర్శ‌కుడు ఇవాళ అమ్మ వారిని ద‌ర్శించుకున్నారు.

Also Read : G Kishan Reddy : ఇంటికో ఉద్యోగం ఎటు పోయింది

Leave A Reply

Your Email Id will not be published!