Byreddy Rajasekhar Reddy : ధ‌ర్మానపై బైరెడ్డి ఫైర్

రాజీనామా చేస్తే బెట‌ర్

Byreddy Rajasekhar Reddy : ఇప్ప‌టికైనా అన్నింటిని ప‌క్క‌న పెట్టండి. వెంట‌నే ఉత్త‌రాంధ్ర‌కు ప్ర‌క‌టించిన రాజ‌ధాని విశాఖ‌ను చేయండి. లేదంటే ప్ర‌త్యేక రాష్ట్రం ప్ర‌క‌టించండి అంటూ సంచ‌ల‌న కామెంట్స్ చేసిన మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావుపై నిప్పులు చెరిగారు రాయ‌ల‌సీమ ప్ర‌త్యేక రాష్ట్ర సాధ‌న స‌మితి చీఫ్ బైరెడ్డి రాజ‌శేఖ‌ర్ రెడ్డి(Byreddy Rajasekhar Reddy).

శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఒక ర‌కంగా ఏకి పారేశారు ధ‌ర్మాన‌ను. చిత్త‌శుద్ధి ఉంటే వెంట‌నే త‌న ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేశారు. ఏపీ ఉమ్మ‌డి రాష్ట్రంలో ఎక్కువ‌గా న‌ష్ట పోయింది త‌మ ప్రాంత‌మేన‌ని ఆవేద‌న చెందారు. అందుకే తాను ఒక్క‌డినే యుద్దం చేస్తున్నాన‌ని చెప్పారు బైరెడ్డి రాజ‌శేఖ‌ర్ రెడ్డి.

ఇప్ప‌టి దాకా ఎన్నో ఉద్య‌మాలు న‌డిచాయ‌ని, కానీ ఉత్త‌రాంధ్ర రాష్ట్రం కంటే ముందు రాయ‌ల‌సీమ ప్రాంతాన్ని ప్ర‌త్యేక రాష్ట్రం చేయాల‌ని పిలుపునిచ్చారు. విశాఖ ఉక్కు ప‌రిశ్ర‌మ కోసం రాయ‌ల‌సీమ‌కు చెందిన ప్ర‌జ‌లు ప్రాణ త్యాగాలు చేశారంటూ మండిప‌డ్డారు. తాము ప్రాణ త్యాగం చేయ‌క పోతే స్టీల్ ప్లాంట్ వ‌చ్చేదా అని నిల‌దీశారు.

ఈ విష‌యం తెలుసు కోకుండా ఎలా ప‌డితే అలా మంత్రి ధ‌ర్మాన మాట్లాడ‌టం విడ్డూరంగా ఉంద‌న్నారు. అమ‌రావ‌తిని కాద‌ని క‌ర్నూలు రాజ‌ధానిని చేసేందుకు ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని పిలుపునిచ్చారు. ఇప్ప‌టికే అన్ని విధాలుగా రాయ‌ల‌సీమ న‌ష్ట పోయింద‌ని ఆవేద‌న చెందారు. రాజ‌కీయాలు చేయ‌డం, మాట‌లు మాట్లాడ‌టం మంచిది కాద‌ని సూచించారు.

కొంత కాలం పాటు మౌనంగా ఉన్న రాజ‌శేఖ‌ర్ రెడ్డి(Byreddy Rajasekhar Reddy) ఉన్న‌ట్టుండి సంచ‌ల‌న కామెంట్స్ చేయ‌డం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.

Also Read : విశాఖ కోసం ధిక్కార స్వ‌రం

Leave A Reply

Your Email Id will not be published!