Byreddy Siddharth Reddy : ‘బాబు ప‌వ‌న్’ ఇద్ద‌రూ ఒక్క‌టే

ఇద్ద‌రూ ఆడుతున్న నాట‌కం

Byreddy Siddharth Reddy : ఏపీ స్పోర్ట్స్ అథారిటీ చైర్మ‌న్ బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి(Byreddy Siddharth Reddy) షాకింగ్ కామెంట్స్ చేశారు. బుధ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. రాజ‌కీయాలు వేరు సినిమా వేర‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ తెలుసుకోలేక పోతున్నార‌ని ఎద్దేవా చేశారు. వ్య‌క్తిగ‌త దూష‌ణ‌లకు దిగినంత మాత్రాన త‌మ‌కు ఉన్న గౌర‌వం ఏమీ త‌గ్గ‌ద‌న్నారు.

ఆ విష‌యం గుర్తిస్తే మంచిద‌ని సూచించారు. ఆరోగ్య‌క‌ర‌మైన విమ‌ర్శ‌ల‌ను, ఆరోప‌ణ‌ల‌ను స్వాగ‌తిస్తామ‌ని కానీ పూర్తిగా త‌మ నాయ‌కుడు జ‌గ‌న్ రెడ్డిని విమ‌ర్శిస్తే ఊరుకునే ప్ర‌స‌క్తి లేద‌ని హెచ్చ‌రించారు బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి(Byreddy Siddharth Reddy). ప‌వ‌న్ క‌ళ్యాణ్ నైజం ఎలా ఉందంటే రంగం సినిమాలోని విల‌న్ క్యారెక్ట‌ర్ ను త‌ల‌పింప చేస్తోందంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ , నారా చంద్ర‌బాబు నాయుడిది లోపాయికారి ఒప్పందం చేసుకున్నార‌ని ఆరోపించారు. అందులో భాగంగానే నాట‌కాలు ఆడుతున్నార‌ని, ప్ర‌జ‌ల‌ను మ‌భ్య పెట్టేందుకు య‌త్నిస్తున్నారంటూ మండిప‌డ్డారు బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి. త‌మ పార్టీ అధినేత సందింటి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గ‌నుక తెలంగాణ‌లో వేలు పెడితే అక్క‌డి రాజ‌కీయాలు త‌ల‌కిందులు కావ‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు.

ఇక‌నైనా ప్ర‌జ‌ల‌కు సేవ చేయడం నేర్చుకోవాల‌ని కానీ నిరాధార‌మైన అవాస్త‌వాల‌ను ప్ర‌చారం చేయాల‌ని చూస్తే ఊరుకోమ‌న్నారు బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి. రాబోయే ఎన్నిక‌ల్లో ఎవ‌రి స‌త్తా ఏమిటో తేలుతుంద‌న్నారు. రాష్ట్రంలోని 175 స్థానాల‌లో తామే గెలుస్తామ‌ని ఆయ‌న ఛాలెంజ్ చేశారు. ఒక ర‌కంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై రెచ్చి పోయారు ఏపీ స్పోర్ట్స్ అథారిటీ చైర్మ‌న్ సిద్దార్థ్ రెడ్డి.

Also Read : బండి’కి బిగ్ షాక్ కొడుకుపై కేసు

Leave A Reply

Your Email Id will not be published!