Chandrababu Naidu : ప్రశ్నిస్తే కేసులు పెడ‌తారా – చంద్ర‌బాబు

ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై ప‌రువు న‌ష్టం కేసు

Chandrababu Naidu : వైసీపీ స‌ర్కార్ పై టీడీపీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు నిప్పులు చెరిగారు. శుక్ర‌వారం ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌ప్పులు చేస్తున్న త‌ప్పుడు ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించ‌డం కూడా నేరం అంటే ఎలా అని ప్ర‌శ్నించారు. రాష్ట్రంలో సామాన్యుల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోయింద‌ని , రాచ‌రిక పాల‌న సాగుతోంద‌ని ధ్వ‌జ‌మెత్తారు.

Chandrababu Naidu Asking

జ‌న‌సేన పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై ప‌రువు న‌ష్టం కింద కేసు పెట్ట‌డం దారుణ‌మ‌న్నారు. ఇది పూర్తిగా క‌క్ష సాధింపు త‌ప్ప మ‌రొక‌టి కాద‌న్నారు. ప్ర‌జ‌లు త‌మ స‌మ‌స్య‌ల‌ను ప్ర‌తిప‌క్ష నాయ‌కుల‌కు విన్న‌వించ‌డం ఎలా నేరం అవుతుంద‌ని నిల‌దీశారు నారా చంద్ర‌బాబు నాయుడు(Chandrababu Naidu). ప్ర‌ధానంగా రాష్ట్రంలో జ‌గ‌న్ ఒక్క‌డే ఉండాల‌ని అనుకుంటున్నాడ‌ని కానీ ప్ర‌జాస్వామ్యంలో ఇది జ‌ర‌గ‌ద‌న్నారు. ప్ర‌భుత్వం అన్నాక ప్ర‌తి దానికీ బాధ్య‌త వ‌హించాలి, జ‌వాబుదారీగా ఉండాల‌ని స్ప‌ష్టం చేశారు టీడీపీ చీఫ్‌.

రూల్స్ కు వ్య‌తిరేకంగా ప్ర‌జ‌ల వ్య‌క్తిగ‌త వివ‌రాల‌ను వాలంటీర్ల ద్వారా సేక‌రించ‌డాన్ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌శ్నించాడ‌ని పేర్కొన్నారు. ప్ర‌ధానంగా కేసు పెట్టాల్సింది ఏపీ స‌ర్కార్ పై అని స్ప‌ష్టం చేశారు. ఈ ప్ర‌భుత్వం ప‌రువు గురించి మాట్లాడ‌ట‌మే పెద్ద జోక్ గా చంద్ర‌బాబు నాయుడు ఎద్దేవా చేశారు.

Also Read : Pawan Kalyan : వాలంటీర్ల‌కు బాస్ ఎవ‌రో చెప్పాలి

 

Leave A Reply

Your Email Id will not be published!