Chandrababu Naidu : నెట్టింట్లో చంద్రబాబు వైరల్
సోషల్ మీడియాలో హల్ చల్
Chandrababu Naidu : హైదరాబాద్ – ఏపీ స్కిల్ స్కాం కేసులో అడ్డంగా బుక్కై రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా 53 రోజుల పాటు శిక్ష అనుభవించారు. తనకు కంటి శస్త్ర చికిత్స ఉందని పేర్కొంటూ అమరావతి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. మానవతా దృక్ఫథంతో ముందస్తు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు పేర్కొంది.
Chandrababu Naidu Photo
భారీ ర్యాలీతో ఏపీ నుంచి హైదరాబాద్ కు బయలుదేరి విచ్చేశారు. ఈ సందర్బంగా టీడీపీ శ్రేణులు భారీ ర్యాలీ చేపట్టింది. దీనిపై తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ సీరియస్ అయ్యింది. కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ప్రభుత్వం కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. చివరకు కేసులు నమోదు చేశారు బాబుతో పాటు టీడీపీ సీనియర్ నేతలపై కూడా.
ఇదిలా ఉండగా చంద్రబాబుపై ఏపీ సీఐడీ ఫైబర్ నెట్ , అమరావతి రింగ్ రోడ్డు ఎలైన్మెంట్ తో పాటు మరికొన్ని కేసులు నమోదు చేశారు. దీంతో నాలుగు వారాల పాటు విరామం దొరకడంతో చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) ఊపిరి పీల్చుకున్నారు. ఈ సందర్బంగా కొంత భావోద్వేగానికి కూడా లోనయ్యారు.
ఇదే సమయంలో చంద్రబాబుకు మద్దతు తెలిపే వారు ఏఐ టెక్నాలజీతో డిఫరెంట్ గా డిజైన్ చేసిన ఫోటోను షేర్ చేశారు. ఇది ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.
Also Read : Rachin Ravindra : రచిన్ రవీంద్ర రికార్డ్