CM Chandrababu Naidu: తల్లికి వందనం అమలుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

తల్లికి వందనం అమలుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

CM Chandrababu Naidu : టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చి ఏడాది అవుతున్న సందర్భంగా… ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. సూపర్‌ సిక్స్‌లో మరో ముఖ్యమైన తల్లికి వందనం హామీని అమలు చేసేందుకు సీఎం చంద్రబాబు(CM Chandrababu Naidu) గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. కూటమి ప్రభుత్వానికి ఏడాదైన సందర్భంగా గురువారం తల్లికి వందనం పథకం నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసారు.

CM Chandrababu Naidu Approved

ఈ తల్లికి వందనం పథకం ద్వారా రాష్ట్రంలో 67.27 లక్షల మంది తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం రూ.8,745 కోట్లు జమ చేయనుంది. ఎన్నికల ముందు కూటమి నేతలు ఇచ్చిన హామీ ప్రకారం కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ తల్లి వందనం ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది ఒకటో తరగతి, ఇంటర్‌ లో చేరిన వారికీ తల్లికి వందనం అమలు చేయనున్నారు. అడ్మిషన్లు పూర్తయ్యి డేటా అందుబాటులోకి రాగానే నిధులు జమ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. ఈమేరకు విధి విధానాలు ఖరారు చేస్తూ గురువారం జీవో విడుదల చేయనుంది. సూపర్‌ సిక్స్‌ హామీల్లో ఇప్పటికే పింఛన్ల పెంపు, అన్న క్యాంటీన్‌, మెగా డీఎస్సీ, దీపం-2 పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోంది.

తల్లులకు అభినందనలు, విద్యార్థులకు శుభాకాంక్షలు – మంత్రి లోకేశ్‌

కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంలో మహిళా మణులకు కానుకగా తల్లికి వందనం పథకం అమలుకు శ్రీకారం చుట్టామని ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. ఈ సందర్భంగా తల్లులకు అభినందనలు… విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. బడికి వెళ్లే పిల్లలందరికీ తల్లికి వందనం అందుతుందన్నారు. ఇప్పటికే పింఛన్ల పెంపు, అన్న క్యాంటీన్లు, మెగా డీఎస్సీ, దీపం-2 అమలు చేశామని పేర్కొన్నారు.

Also Read : YS Jagan: పొదిలి పొగాకు రైతులకు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ పరామర్శ

Leave A Reply

Your Email Id will not be published!