CM KCR : సాంస్కృతిక సార‌థి ఉద్యోగుల‌కు గుడ్ న్యూస్

పీఆర్సీ అమ‌లుకు సీఎం కేసీఆర్ ప‌చ్చ జెండా

CM KCR : తెలంగాణ‌లో ఎన్నిక‌ల వేళ కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు బీఆర్ఎస్ బాస్, సీఎం కేసీఆర్(CM KCR). ఇప్ప‌టికే తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ‌ను ప్ర‌భుత్వంలో విలీనం చేస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు. అంతే కాదు ఇక నుంచి సంస్థ‌లో ప‌ని చేస్తున్న ఉద్యోగులంతా ప్ర‌భుత్వ ఉద్యోగులుగా ప‌రిగ‌ణిస్తున్న‌ట్లు చెప్పారు.

CM KCR Good News

సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ప‌ని చేస్తున్న కాంట్రాక్టు సిబ్బందిని ప‌ర్మినెంట్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది స‌ర్కార్. తాజాగా రాష్ట్ర స‌ర్కార్ సార‌థ్యంలో ప‌ని చేస్తున్న తెలంగాణ సాంస్కృతిక సార‌థి ఉద్యోగుల‌కు శుభ‌వార్త చెప్పారు సీఎం కేసీఆర్.

ఈ మేర‌కు అందులో ప‌ని చేస్తున్న ప్ర‌తి ఒక్క‌రికీ పీఆర్సీ ( పే రివిజ‌న్ క‌మిష‌న్ ) అమ‌లు చేయ‌నున్న‌ట్లు స్పష్టం చేశారు. పీఆర్సీ అమ‌లు చేస్తూ రాష్ట్ర సాంస్కృతిక‌, యువ‌జ‌న స‌ర్వీసులు, ప‌ర్యాట‌క శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది.

పీఆర్సీ 2020 ప్ర‌కారం ఉద్యోగుల‌కు పీఆర్సీ వ‌ర్తిస్తుంద‌ని పేర్కొంది స‌ర్కార్. పెంచిన పీఆర్సీ జూన్ 1, 2021 నుండి వ‌ర్తిస్తుంద‌ని తెలిపింది. పీఆర్సీ అమ‌లుకు సంబంధించి త‌దుప‌రి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని భాషా సాంస్కృతిక శాఖ డైరెక్ట‌ర్ ను ఆదేశించింది. ఆర్థిక శాఖ క్లియ‌రెన్స్ కూడా ఇచ్చింది.

Also Read : Pavithra Samarpana : శ్రీ‌వారికి ఘ‌నంగా ప‌విత్ర స‌మ‌ర్ప‌ణ‌

Leave A Reply

Your Email Id will not be published!