Mamata Banerjee : అమిత్ షా క‌నుస‌న్న‌ల‌లో దేశ పాల‌న – దీదీ

సంచ‌ల‌న కామెంట్స్ చేసిన మ‌మ‌తా బెన‌ర్జీ

Mamata Banerjee :  తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్‌, ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ(Mamata Banerjee) షాకింగ్ కామెంట్స్ చేశారు. కేవ‌లం బీజేపీయేత‌ర వ్య‌క్తులు, సంస్థ‌లు, ప్ర‌భుత్వాల‌ను కావాల‌ని ల‌క్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారంటూ ఆరోపించారు.

విచిత్రం ఏమిటంటే పేరుకు మాత్ర‌మే మోదీ ప్ర‌ధాన‌మంత్రి కానీ న‌డిపేదంతా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షానేన‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు దీదీ.

విచిత్రం ఏమిటంటే కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌లు ఏం చేస్తున్నాయో, ఎవ‌రి ప్ర‌యోజ‌నాల కోసం దాడులు చేస్తున్నారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు మ‌మ‌తా బెన‌ర్జీ.

కొంత మంది బీజేపీ నాయ‌కులు కుట్ర‌లు చేస్తున్నారంటూ మండిప‌డ్డారు. వారు త‌రచుగా నిజాం ప్యాలెస్ కు వెళుతున్నారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

చాలా మంది నిజాయితీ క‌లిగిన వ్యాపార‌వేత్త‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌స్తుతం సీబీఐ , ఈడీ ప్ర‌ధాన మంత్రికి నివేదిక ఇవ్వాల్సి ఉండ‌గా మొత్తం ద‌ర్యాప్తు సంస్థ‌ల‌న్నీ అమిత్ షా క‌న్నుస‌న్న‌ల‌లో న‌డుస్తున్నాయంటూ ధ్వ‌జ‌మెత్తారు సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ(Mamata Banerjee).

చాలా మంది వ్యాపార‌వేత్త‌లు భ‌యాందోళ‌న‌లో ఉన్నార‌ని ఎక్కువ శాతం విదేశాల‌కు వెళుతున్నారంటూ మండిప‌డ్డారు. ఇలా అయితే దేశం ఎలా అభివృద్ధి చెందుతుంద‌ని ప్ర‌శ్నించారు.

సీబీఐ ప్ర‌ధాని కార్యాల‌యానికి రిపోర్ట్ చేయ‌ద‌ని సంచ‌ల‌న కామెంట్స్ చేశారు దీదీ. ఇదిలా ఉండ‌గా గ‌తంలో మోదీని టార్గెట్ చేసేది. కానీ ప్ర‌స్తుతం అమిత్ షాను ల‌క్ష్యంగా చేసుకుని వ్యాఖ్య‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది.

ఇదిలా ఉండ‌గా త‌నను తాను రక్షించుకునేందుకు ఇలాంటి వ్యాఖ్య‌లు చేస్తోందంటూ సువేందు అధికారి ఆరోపించారు.

Also Read : కాంగ్రెస్ చీఫ్ రేసులో ఆ ఇద్ద‌రు

Leave A Reply

Your Email Id will not be published!