President Murmu : ద్రౌప‌ది ముర్ముకు ఘ‌న స్వాగ‌తం

స‌న్మానించిన సీఎం సిద్ద‌రామ‌య్య

President Murmu : క‌ర్ణాట‌క‌లో ప‌ర్య‌ట‌న నిమిత్తం దేశ రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము సోమ‌వారం బెంగ‌ళూరుకు చేరుకున్నారు. ఈ సంద‌ర్బంగా రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ థాప‌ర్ చంద్ గెహ్లాట్ , సీఎం సిద్ద‌రామ‌య్య ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. విమానాశ్ర‌యంకు చేరుకున్న ఆమెకు సాద‌రంగా ఆహ్వానించారు. స‌న్మానించారు. సీఎం అపూర్వ‌మైన రీతిలో త‌న‌కు వెల్ క‌మ్ చెప్ప‌డంతో రాష్ట్ర‌ప‌తి సంతోషానికి లోనయ్యారు. ఆమె ఆనందం వ్య‌క్తం చేశారు.

రాష్ట్ర‌ప‌తి ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ప‌లు కార్య‌క్ర‌మాల‌లో పాల్గొన్నారు. ఇదిలా ఉండ‌గా రాష్ట్ర‌ప‌తి టూర్ కార‌ణంగా భారీ ఎత్తున భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేశారు. కాగా తొలిసారిగా కాంగ్రెస్ స‌ర్కార్ కొలువు తీరిన త‌ర్వాత ద్రౌప‌ది ముర్ము(Draupadi Murmu) ఇక్క‌డికి విచ్చేశారు. మ‌రో వైపు సీఎంగా సిద్ద‌రామ‌య్య కొలువు తీరిన వెంట‌నే ఆయ‌న ఢిల్లీకి వెళ్లారు. అక్క‌డ మ‌ర్యాద పూర్వ‌కంగా దేశ ప్ర‌ధాని మోదీని, ట్ర‌బుల్ షూట‌ర్ , కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ చంద్ర షాను క‌లుసుకున్నారు.

అక్క‌డి నుంచి నేరుగా రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్మును క‌లుసుకుని ఆమెకు అభినంద‌న‌లు తెలిపారు. ఒక ఆదివాసీ బిడ్డ ఈ దేశానికి ప్ర‌థ‌మ పౌరురాలుగా ఉండ‌డం గొప్ప విష‌య‌మ‌న్నారు. ఇదే స‌మ‌యంలో అపురూప‌మైన జ్ఞాపిక‌ను అంద‌జేశారు రాష్ట్ర‌ప‌తికి సీఎం సిద్ద‌రామ‌య్య .రాష్ట్రానికి రావాల్సిందిగా ఆహ్వానించారు ద్రౌప‌ది ముర్మును.

Also Read : MLA Raghunandan Rao : దుబ్బాక ఎమ్మెల్యే ధిక్కార స్వ‌రం

Leave A Reply

Your Email Id will not be published!