Narayana CM KCR : కేసీఆర్ నిర్ణయం అభినందనీయం
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
Narayana CM KCR : ప్రొఫెసర్ హరగోపాల్ తో పాటు ఇతరులపై తెలంగాణ పోలీసులు నమోదు చేసిన ఉపా రాజద్రోహం కేసు ను ఎత్తి వేయాలని సీఎం కేసీఆర్ శనివారం ఆదేశించారు. ఈమేరకు ఆయన డీజీపీని వెంటనే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. దీనిపై సీరియస్ గా స్పందించాయి ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు. తెలంగాణ ఉద్యమానికి వెన్నుదన్నుగా ఉంటూ వచ్చిన హర గోపాల్ పై రాజద్రోహం కేసు ఎలా పెడతారంటూ ప్రశ్నించాయి. ఆయనపై కేసు నమోదు చేయడం దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. మేధావులతో పాటు వివిధ సామాజిక కార్యకర్తలు తప్పు పట్టారు.
ఇదిలా ఉండగా ఇవాళ హర గోపాల్ పై రాజద్రోహం కేసు ఎత్తి వేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నట్లు స్పష్టం చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి కొనకళ్ల నారాయణ(Narayana). విచిత్రం ఏమిటంటే ములుగు పోలీస్ స్టేషన్ లో హర గోపాల్ తో పాటు మరో 150 మందిపై రాజద్రోహం కింద కేసు నమోదు చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పు పట్టారు.
ఇవాళ సీపీఐ కార్యదర్శి నారాయణ జాతీయ మీడియాతో మాట్లాడారు. ప్రొఫెసర్ హర గోపాల్ తెలంగాణ ఉద్యమంతో పాటు అనేక ప్రజా పోరాటాలలో పాల్గొన్నారని గుర్తు చేశారు. ఆనాటి ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని యావత్తు దేశానికి, ప్రపంచానికి తెలిసేలా చేశారని ప్రశంసించారు. అలాంటి వ్యక్తిపై ఎలా రాజద్రోహం కేసు నమోదు చేస్తారని ప్రశ్నించారు కొనకళ్ల నారాయణ.
Also Read : CM KCR : హరగోపాల్ పై రాజద్రోహం కేసు ఎత్తేయండి