Delhi BJP : హామీలు ఇచ్చారు ఆచ‌ర‌ణ మ‌రిచారు

ఢిల్లీ సీఎంపై బీజేపీ సంచ‌ల‌న ఆరోప‌ణ‌

Delhi BJP  : ఢిల్లీ ఆప్ స‌ర్కార్ పై భార‌తీయ జ‌న‌తా పార్టీ (Delhi BJP )సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. ఆప్ క‌న్వీన‌ర్ ,సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ మాయ మాట‌లు చెప్ప‌డంలో దిట్ట అని పేర్కొంది. హామీలు ఇచ్చారు కానీ ఆచ‌ర‌ణ‌లో మ‌రిచి పోయారంటూ ఆరోపించింది.

సీఎం గ‌తంలో 1,000 మొహ‌ల్లా క్లినిక్ లు ఏర్పాటు చేస్తామ‌ని చెప్పారు. ఆయ‌న పాలించిన ఈ ఏడేళ్ల‌లో కేవ‌లం 200 క్లినిక్ లు మాత్ర‌మే ఏర్పాటు చేశార‌ని మండిప‌డ్డారు బీజేపీ స్టేట్ చీఫ్ ఆదేశ్ గుప్తా.

బీజేపీ ప్ర‌ధాన కార్యాల‌యంలో ప్రతిప‌క్ష నాయ‌కుడు రాం వీర్ సింగ్ బిధూరీ స‌మక్షంలో ఆదేశ్ గుప్తా మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ సీఎం పాల‌న‌పై మండిప‌డ్డారు. ఆప్ వైఫ‌ల్యాల గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు.

బీజేపీ చీఫ్ ఆదేశ్ గుప్తాతో పాటు ఎంపీ ర‌మేష్ బిధూరి, ప‌ర్వేష్ సాహిబ్ సింగ్ , ఢిల్లీ అసెంబ్లీలో ప్ర‌తిప‌క్ష నేత రాం వీర్ సింగ్ బిధూరి, రోహిణి ఎమ్మెల్యే విజేంద‌ర్ గుప్తా, బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు ముంజీద‌ర సిగ్ సిర్సా పాల్గొన్నారు.

సీఎం కేజ్రీవాల్ గొప్ప‌లు చెప్ప‌డం త‌ప్పా ఢిల్లీకి చేసింది ఏమీ లేద‌న్నారు. ఉన్న 200 క్లినిక్ ల‌లో ప‌రిస్థితి దారుణంగా ఉంద‌న్నారు . మందులు లేవు. వైద్య స‌దుపాయాలు అస‌లే లేవ‌ని ఆరోపించారు గుప్తా.

ప్ర‌తి ఇంటికి మంచి నీరు ఇస్తాన‌ని ప్ర‌గ‌ల్భాలు ప‌లికారు. కానీ ఈరోజు వ‌ర‌కు అది ఆచ‌ర‌ణ‌కు నోచు కోలేద‌న్నారు. 63 శాతం మంది ఢిల్లీ ప్ర‌జ‌లు శుద్ధి చేసిన తాగు నీరు తాగ‌డం లేద‌న్నారు.

దీనికి ప్ర‌ధాన కార‌ణం ఆప్ స‌ర్కార్ వైఫ‌ల్య‌మేన‌ని ఆరోపించారు గుప్తా.

Also Read : గుజ‌రాత్ సీఎంకు కేజ్రీవాల్ సవాల్

Leave A Reply

Your Email Id will not be published!