#ArvindKejriwal : ప్రజా సంక్షేమానికే కేజ్రీ ప్రయారిటీ
Arvind Kejriwal : మహిళల కోసం ఉచితంగా బస్సులో ఎక్కడికైనా ప్రయాణించే సౌలభ్యం ఏర్పాటు చేసింది సర్కార్. దీంతో మహిళలు కేజ్రీవాల్ కు జేజేలు పలుకుతున్నారు. భాయ్ దూజ్ పండగను పురస్కరించుకొని దీనిని అమల్లోకి తీసుకు వచ్చారు.
Arvind Kejriwal: దేశంలో రాజకీయాలన్నీ ఒక ఎత్తైతే రాజధానిలో మాత్రం వెరీ వెరీ డిఫరెంట్. దేశమంతటా 70 శాతానికి పైగా కాషాయం తన పట్టు బిగించినా అటు దక్షిణాదిలో ఇటు ఢిల్లీలో తన ప్రతాపాన్ని చూపించ లేక పోతోంది. మోదీ, షా ద్వయం ఎన్ని ప్రయోగాలు చేసినా కేజ్రీవాల్ ప్రభను తగ్గించలేక పోతోంది. గతంలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమంటూ సర్వేలు, మీడియా ఛానళ్లు కోడై కూశాయి. కానీ ఫలితాలు వచ్చాక చతికిలపడ్డాయి. ఈసారి ఎప్పటి లాగే కేజ్రివాల్ మరింత దూకుడు పెంచలేదు. కానీ చాప కింద నీరులా తన పని తాను చేసుకుంటూ పోయాడు. జనరంజకమైన పాలనను అందిస్తూనే పార్టీపై పట్టు సాధించాడు. ఆయన వెనుక ఇండియన్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ పనిచేశాడు. ఆప్ ను పవర్ లోకి తీసుకు వచ్చేలా చేశాడు.
విద్య, వైద్య, తాగు నీరు, ఉపాధి కల్పించడంపైనే కేజ్రీవాల్ ఫోకస్ పెట్టాడు. అంతే కాదు ప్రజాకర్షక పథకాలు ఎడా పెడా ప్రకటించ లేదు. కానీ అన్ని వర్గాలు సంతృప్తి చెందేలా నిర్ణయాలు తీసుకున్నారు. దీంతో ఆయన పాలనపై ప్రజలు నమ్మకాన్ని పెంచుకున్నారు. అదేమిటంటే సమాజంలో సగ భాగమైన మహిళలకు మేలు చేకూర్చేలా చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు, దేశంలో ఎక్కడా లేవిధంగా పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పించారు. మెరుగైన విద్య కోసం నిధులు ఖర్చు చేశారు. అంతే కాకుండా విద్యా హక్కు చట్టాన్ని సక్రమంగా అమలు చేసేందుకు కృషి చేస్తున్నారు. మహిళా సాధికారత పేరుతో ఒకే ఒక్క రోజును నిర్వహించి చేతులు దులుపుకోవడం కాదు, కావాల్సింది వారు తమ కాళ్లపై తాము నిలబడాలి.
అంతే కాదు మహిళలు, యువతులు ఎప్పుడైనా, ఎక్కడికైనా వెళ్లగలిగేలా చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని గతంలోనే పలుసార్లు ప్రకటించారు. అయితే బీజేపీ మాత్రం ఇదంతా ఆప్ ఆడుతున్న నాటకం అని కొట్టి పారేసింది. దానిని ఆప్ పట్టించు కోలేదు. మహిళల కోసం ఉచితంగా బస్సులో ఎక్కడికైనా ప్రయాణించే సౌలభ్యం ఏర్పాటు చేసింది సర్కార్. దీంతో మహిళలు కేజ్రీవాల్ కు జేజేలు పలుకుతున్నారు. భాయ్ దూజ్ పండగను పురస్కరించుకొని దీనిని అమల్లోకి తీసుకు వచ్చారు. మహిళలకు సురక్షిత ప్రయాణ అనుభూతిని కలిగించాలనే ఉద్దేశంతోనే ఈ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చిందని కేజ్రివాల్ స్పష్టం చేశారు.
దీంతో ఇపుడు ఢిల్లీ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ కు చెందిన బస్సులతో పాటు క్లస్టర్ బస్సులలో కూడా ఫ్రీగా ట్రావెల్ చేస్తున్నారు మహిళలు. కాగా మహిళలు, యువతులు టికెట్ తీసు కోవాలను కోవడం, ఉచితంగా ప్రయాణించాలని అనుకోవడం వారి ఇష్టానికే వదిలేశామన్నారు. ట్రావెల్ చేయాలని అనుకున్నవారు కండక్టర్ వద్ద సింగిల్ జర్నీ పాసు ఉంటుందని, దానిని తీసుకోవాలని సూచించారు. ఈ మహిళల ఉచిత ప్రయాణం వల్ల ప్రభుత్వంపై అదనంగా 290 కోట్ల రూపాయల భారం పడుతోంది. అయినా ఆప్ భరిస్తోంది. ఇదే ఉచిత ప్రయాణాన్ని దేశమంతటా అమలు చేస్తే బావుంటుంది కదూ.
No comment allowed please