Devendra Fadnavis : సీఎం సుప్రీం షిండే మాటే వేదం

స్ప‌ష్టం చేసిన డిప్యూటీ సీఎం ఫ‌డ్న‌వీస్

Devendra Fadnavis : మ‌హారాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఏక్ నాథ్ షిండే కేవ‌లం బొమ్మ మాత్ర‌మేన‌ని అంతా న‌డిపిస్తున్న‌దంతా మీరేనంటూ ఆరోప‌ణ‌లు చేస్తున్న దాంట్లో అర్థం లేద‌న్నారు.

ముఖ్య‌మంత్రిగా, డిప్యూటీ సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేసిన అనంత‌రం మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిసేందుకు షిండే, దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ ఢిల్లీకి వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా కేంద్ర హోం శాఖ మంత్రి, ట్ర‌బుల్ షూట‌ర్ అమిత్ చంద్ర షాతో భేటీ అయ్యారు.

పైకి కాద‌ని చెప్పినా లోలోప‌ట తాజాగా ఏర్పాటు చేయ‌బోయే క్యాబినెట్ లో ఎవ‌రు ఉండాల‌నే దానిపై చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం. శ‌నివారం ఈ ఇద్ద‌రూ క‌లిసి దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ, రాష్ట్ర‌ప‌తి రామ్ నాథ్ కోవింద్(Ramnath Kovind) ను క‌లిశారు.

అనంత‌రం ఢిల్లీలో దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ , సీఎం షిండేతో క‌లిసి మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్బంగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఏక్ నాథ్ షిండేనే సీఎం..మ‌రాఠాకు ఆయ‌నే సుప్రీం.

ఆయ‌న ఏది చెబితే అదే వేదం..అదే శాస‌నం. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు దేవేంద్ర ఫ‌డ్న‌వీస్(Devendra Fadnavis). ఆయ‌నే మా నాయ‌కుడు. షిండే కింద మేమంతా ప‌ని చేస్తామ‌ని చెప్పారు.

గ‌తంలో మేం క‌లిసే ఉన్నాం కానీ కొన్ని శ‌క్తుల కారణంగా విడి పోవాల్సి వ‌చ్చింది. కానీ ఇప్పుడు క‌లిసే ఉన్నామ‌ని, ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశామ‌ని చెప్పారు దేవేంద్ర ఫ‌డ్న‌వీస్.

త్వ‌ర‌లోనే మంత్రివ‌ర్గం కూర్పు ఉంటుంద‌న్నారు. దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబైని అన్ని రంగాల‌లో టాప్ లో ఉంచేందుకు ప్ర‌య‌త్నం చేస్తామ‌న్నారు షిండే.

Also Read : శివ‌సేన శాశ్వ‌తం అజ‌రామ‌రం – ఠాక్రే

Leave A Reply

Your Email Id will not be published!