Nalin Kumar Kateel : అభివృద్ది వ‌ద్దు ‘మ‌తం’ ముద్దు – క‌టీల్

క‌ర్ణాట‌క బీజేపీ చీఫ్ షాకింగ్ కామెంట్స్

Nalin Kumar Kateel : క‌ర్ణాట‌క‌లో రాజ‌కీయాలు మ‌రింత వేడెక్కాయి. ఇప్ప‌టికే ట్రబుల్ షూట‌ర్ అమిత్ షా ఆధ్వ‌ర్యంలో అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని ప్రారంభించింది బీజేపీ. సీఎం బ‌స్వ‌రాజ్ బొమ్మైతో పాటు మంత్రులు, ప్ర‌జాప్ర‌తినిధులు ఎన్నిక‌ల క్యాంపెయిన్ లో బిజీ బిజీగా గ‌డుపుతున్నారు.

తాజాగా ఎన్నిక‌ల ప్ర‌చారంలో బాగంగా రాష్ట్ర భార‌తీయ జ‌న‌తా పార్టీ చీఫ్ , ఎంపీ న‌ళిన్ కుమార్ క‌టీల్(Nalin Kumar Kateel) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రోడ్లు, ఇళ్లు, ఇత‌ర స‌మ‌స్య‌ల గురించి ప్ర‌స్తావించ‌కండి అని కేవ‌లం హిందూ మ‌తం గురించి మాట్లాడాల‌ని పిలుపునిచ్చారు. దేశ‌మంటే మ‌ట్టి కాదోయ్ దేశ‌మంటే మ‌నుషులోయ్ అన్న గుర‌జాడ మాట‌ల్ని పెడ‌చెవిన పెట్టారు.

పొద్ద‌స్తమానం కులం, ప్రాంతం, మ‌తం పేరుతో రాజ‌కీయం చేస్తూ వ‌స్తోంది భార‌తీయ జ‌న‌తా పార్టీ. స‌మ‌స్య‌లనేవి చిన్న‌వ‌ని వాటి గురించి తమ‌ను అడ‌గ‌వ‌ద్దంటూ కొత్త భాష్యం చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. ప్ర‌స్తుతం క‌ర్ణాట‌క బీజేపీ చీఫ్ చేసిన వ్యాఖ్య‌లు జ‌నాన్ని విస్తు పోయేలా చేస్తున్నాయి.

ఇప్ప‌టికే రాష్ట్రంలో కొలువు తీరిన కాషాయ స‌ర్కార్ పై అంతులేని అవినీతి, అక్ర‌మాల ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. ఇప్ప‌టి వ‌ర‌కు కాంట్రాక్ట‌ర్లు లంచం ఇచ్చుకోలేక సూసైడ్ చేసుకోవ‌డం క‌ల‌క‌లం రేపింది. స‌మ‌స్య‌ల గురించి అడ‌గ‌కండి అని కేవ‌లం ల‌వ్ జిహాద్ గురించి మాత్ర‌మే అడ‌గాల‌ని న‌ళిన్ కుమార్ క‌టీల్ అన్నారు. క‌టీల్(Nalin Kumar Kateel) పై ప్ర‌తిప‌క్షాలు తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాయి.

న‌ళిన్ కుమార్ క‌టీల్ చేసిన కామెంట్స్ పై నిప్పులు చెరిగారు క‌ర్ణాట‌క ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ చీఫ్ డీకే శివ‌కుమార్.

Also Read : ‘కాషాయాని’కి గాయత్రి రఘురామ్ క‌టీఫ్

Leave A Reply

Your Email Id will not be published!