Eatala Rajender : త్వ‌ర‌లో దొంగ‌లు ఎవ‌రో తేలుతుంది – ఈట‌ల

క‌ల్వ‌కుంట్ల కవిత‌పై షాకింగ్ కామెంట్స్

Eatala Rajender : బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో క‌ల్వ‌కుంట్ల క‌విత‌తో పాటు ఎంపీ మాగుంట శ్రీ‌నివాసులు రెడ్డి , శ‌ర‌త్ చంద్రా రెడ్డి ఉండ‌డం క‌ల‌క‌లం రేపింది. ఇప్ప‌టికే సౌత్ గ్రూప్ రూ. 100 కోట్లు ముడుపుల రూపేణా చెల్లించ‌డం మ‌రింత విస్తు పోయేలా చేసింది.

ఈ సంద‌ర్భంగా క‌విత చేసిన కామెంట్స్ పై ఈట‌ల రాజేంద‌ర్(Eatala Rajender) స్పందించారు. అస‌లు దొంగ‌లు ఎవ‌రో దొర‌లు ఎవ‌రో త్వ‌ర‌లోనే తేలుతుంద‌న్నారు. మాయ మాట‌లు చెబుతూ , రాష్ట్రాన్ని దోచుకున్న‌ది చాల‌క దేశ రాజ‌ధాని ఢిల్లీపై ప‌డ్డారంటూ మండిప‌డ్డారు.

తానేమీ త‌ప్పు చేయ‌క పోతే త‌న గురించి ఎవ‌రూ మాట్లాడ వ‌ద్దంటూ హైకోర్టుకు వెళ్లి స్టే తీసుకు రావాల్సిన అవ‌స‌రం ఏమొచ్చింద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఇన్ని వేల కోట్లు ఎక్క‌డి నుంచి వ‌చ్చాయ‌ని నిల‌దీశారు. రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు స‌మాధానం చెప్పాల్సిన బాధ్య‌త క‌విత‌కు లేదా అని ప్ర‌శ్నించారు.

తెలంగాణ పోరాటంలో అసువులు బాసిన కానిస్టేబుల్ కిష్ట‌య్య వ‌ర్ధంతి సంద‌ర్భంగా నివాళులు అర్పించారు ఈట‌ల రాజేంద‌ర్(Eatala Rajender). ఈ సంద‌ర్బంగా ట్యాంక్ బండ్ వ‌ద్ద ఆయ‌న విగ్ర‌హాన్ని ఏర్పాటు చేయాల‌ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప‌నై పోయింద‌న్నారు.

ఇక మిగిలింది బీజేపీ ఒక్క‌టేన‌ని కేసీఆర్ ను ఢీకొనే స‌త్తా త‌మ‌కు మాత్ర‌మే ఉంద‌న్నారు ఈట‌ల. రాబోయే రోజుల్లో ఎవ‌రు నీతిమంతులో వారికే ప్ర‌జ‌లు ప‌ట్టం క‌ట్ట‌డం ఖాయ‌మ‌న్నారు. జ‌నం అంతా గ‌మ‌నిస్తున్నార‌ని ఆ మాత్రం అర్థం చేసుకోకుండా మాట్లాడితే కేసీఆర్ కు గుణపాఠం త‌ప్ప‌ద‌న్నారు.

Also Read : కేటీఆర్ భార్య ఆంధ్రా ఆమె కాదా – ష‌ర్మిల‌

Leave A Reply

Your Email Id will not be published!